వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- October 13, 2025
కువైట్: వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసన్స్ అమ్మకాలపై కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఉత్పత్తులను వెండింగ్ యంత్రాల ద్వారా ప్రదర్శించవచ్చని, విక్రయించవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దేల్-వహాబ్ అల్-అవధి ఉత్తర్వులను జారీ చేశారు. నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా ఎలక్ట్రానిక్గా దరఖాస్తులను సమర్పించి, అనుమతి తీసుకోవాలని నిర్దేశించారు.
సదరు ఫార్మసీలు చెల్లుబాటు అయ్యే ఆపరేటింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, యంత్రాలను పర్యవేక్షించడానికి లైసెన్స్ పొందిన ఫార్మసిస్ట్ లేదా టెక్నీషియన్ను నియమించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రతి ఫార్మసీ గరిష్టంగా ఐదు వెండింగ్ మెషీన్లను నిర్వహించవచ్చు. ప్రతి యంత్రానికి లైసెన్స్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుందని, అన్ని అవసరాలను తీర్చిన తర్వాత పునరుద్ధరించబడుతుందన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







