150 మంది రెసిడెంట్స్‌పై జరీమానా

- July 15, 2016 , by Maagulf
150 మంది రెసిడెంట్స్‌పై జరీమానా



రస్‌ అల్‌ ఖైమా పబ్లిక్‌ వర్క్స్‌ అండ్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ 150 మంది రెసిడెంట్లకు జరీమానా విధించింది. పరసరాల పరిశుభ్రతను పాటించకపోవడంతో వీరిపై ఈ చర్యలు తీసుకున్నారు. క్యాన్లను విసిరివేయడం, డిస్పోజబుల్‌ బాక్స్‌లు, ఇతరత్రా చెత్తను నిబంధనలకు విరుద్ధంగా పడేయడం వంటి నిబంధనల ఉల్లంఘనకుగాను ఈ జరీమానాల్ని విధించినట్లు అధికారులు తెలిపారు. ఈద్‌ సందర్భంగా తనిఖీలు ఉంటాయనీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించినా, కొందరు ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేసినట్లు అధికారులు వివరించారు. జరీమానాల్ని చెల్లించనివారి ఐడీలను రద్దు చేసి, విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు అధికారులు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com