ఏడేళ్లు పైబడిన పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి!
- July 15, 2025
న్యూఢిల్లీ: ఏడు సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్ను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, సంరక్షకులకు విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే ఐదేళ్లు నిండినా బయోమెట్రిక్స్ను అప్డేట్ చేయని పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ (MBU) చేయించుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పష్టంచేసింది.
ఇందుకోసం UIDAI రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు SMS అలర్ట్లు పంపించడం ప్రారంభించింది. చిన్నపిల్లలు ఐదేళ్లు నిండే వరకు ఆధార్ కోసం ఫోటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా రుజువులు మాత్రమే తీసుకుంటారు. చిన్నారుల శరీర లక్షణాలు అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆ వయసులో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ తీసుకోరు.
పిల్లలకి ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, కొత్త ఫోటోలను నమోదు చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియను 5 – 7 సంవత్సరాల మధ్య ఉచితంగా చేయవచ్చు. ఏడు సంవత్సరాల వయస్సు తర్వాత, బయోమెట్రిక్లను నవీకరించడానికి UIDAI నామమాత్రపు రుసుము రూ.100 మాత్రమే నిర్ణయించింది.
పాఠశాల అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలు, స్కాలర్షిప్లు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పథకాలు వంటి వివిధ ప్రభుత్వ సేవలను పొందేందుకు నవీకరించబడిన ఆధార్ అవసరం.. ప్రభుత్వ పథకాలను సజావుగా పొందేందుకు, సేవలలో అంతరాయం కలగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్లను అప్డేట్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం, UIDAI పునరుద్ఘాటిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







