పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: మంత్రి కందుల దుర్గేష్
- July 16, 2025
విజయవాడ: రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని, విస్తృత ప్రచారం కల్పించి మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు.వెలగపూడి సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని తన పేషిలో ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రస్తుత పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ (DPR) ల తయారీ, క్యారవాన్, హోమ్ స్టే పాలసీ విధివిధానాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు, రీజినల్ సమ్మిట్ లు, శాఖాపరమైన సమావేశాలు, ఇటీవల కుదుర్చుకున్న ఎంవోయూలు, క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ తదితర అంశాలపై మంత్రి దుర్గేష్ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మాట్లాడుతూ ఏపీలో 25 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు, 50వేల గదుల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, ముంబయిలలో రోడ్ షోలు ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 22 దేవాలయాల్లో టెంట్ సిటీలతో పాటు ఇగ్లూ తరహా ఇళ్ల విషయం ఆలోచించాలన్నారు.
అనంతరం విశాఖపట్నంలోని రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ సుందరీకరణ అంశంపై చర్చించారు. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకుల భద్రత, బీచ్ పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలను తొలగించి పర్యాటకులకు అవసరమైన మోలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. లేపాక్షి, లంబసింగి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!







