మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- February 09, 2026
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS), బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని ప్రజలు అలోచించి ఓటేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ పాలనను, తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనను బేరీజు వేసుకొని ఓటేయాలని అన్నారు సీఎం రేవంత్.
కేంద్రంలో గత 11ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజలు చేసిందేమీ లేదని అన్నారు.హైదరాబాద్ కు వరద నష్టాన్ని ఇప్పటికీ కేంద్రం ఇవ్వలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని బండి సంజయ్ అంటున్నారని 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారో ముందు చెప్పాలని గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని చెప్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.గత ప్రభుత్వాలు ఏం చేయలేదని, రెండేళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ఎన్నో హామీలు నెరవేర్చిందని చెప్పారు. ఓటు వేసే ముందు ఓటర్లు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం వలన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









