నిమిషకు మరణశిక్ష పడాల్సిందే...బాధిత కుటుంబం
- July 16, 2025
యెమెన్: యెమెన్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మహిళ నిమిష ప్రియకు తాత్కాలికంగా ఊరట లభించిన విషయం తెలిసిందే. కోర్టు ఆమె మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయం ఆమె కుటుంబానికి కాస్త ఊరటను కలిగించింది. అయితే ఇది తుదికి క్షమాదానం కాదని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.
బ్లడ్ మనీకి నిరాకరణ–బాధిత కుటుంబం బాంబ్
నిమిష ప్రియకు క్షమాభిక్ష దొరకే అవకాశం బ్లడ్ మనీ (పరిహారధనం) చెల్లింపుతో ఉండొచ్చని భావించారు. కానీ మృతుడి సోదరుడు అబ్రెల్ స్పష్టంగా “బ్లడ్ మనీకి మేము అంగీకరించం, శిక్ష పడాల్సిందే” అని డిమాండ్ చేయడంతో పరిస్థితి తిరుగుబాటు లాంఛనంగా మారింది. ఇది నిమిష ప్రియకు తీవ్ర ప్రతికూలతగా మారింది.
బాధిత కుటుంబం ప్రకారం నిమిష ప్రియ ఇస్లామిక్ లా ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని అంటోంది. వారు క్షమించేందుకు సిద్ధంగా లేరని స్పష్టంగా ప్రకటించారు. దీంతో ఇప్పటికే తీవ్రమైన నిమిష పరిస్థితి మరింత సంక్షోభానికి గురైంది. మళ్లీ కోర్టు విచారణకు వెళ్తేనేగాని, ఆమె భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందన్నది తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







