నీస్లో జరిగిన ఘటన బాగో లేదు : వర్మ
- July 15, 2016
ఫ్రాన్స్లోని నీస్లో బాస్టిల్ డే సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ ట్రక్కు మృత్యుశకటంలా ప్రజలపైకి దూసుకెళ్లి 80 మందికి పైగా బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా మరోసారి తనదైన శైలిలో స్పందించారు.'నీస్లో జరిగిన ఘటన బాగో లేదు. ఇలాంటి తీవ్ర ఘటనలు ఎక్కడైనా జరగొచ్చు. జరగకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలని ఉంది కానీ ఏ దేవుడిని ప్రార్థించాలో తెలియడంలేదు. ఇలాంటి సామూహిక హత్యలు చేయడానికి బాంబులు అవసరంలేదు, వాహనాలు ఉంటే చాలని ఈ ఘటన నిరూపించింది. నీస్ దాడిని ఖండిస్తున్నాం అంటూ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జోకుల్లాగా మారిపోయాయి. ఇలాంటి దాడులకు పాల్పడే క్రూరులు మంచి మాటలు వింటారా?' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు వర్మ.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







