సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- July 16, 2025
సిరియా రాజధాని డమాస్కస్ ఒకసారి మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లింది.ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోని సైనిక ప్రధాన కార్యాలయంపై విమానదాడి చేసింది.ఈ దాడిని ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది.ఇదే విషయాన్ని సిరియా సైనిక వర్గాలు కూడా నిర్ధారించాయి. ఈ దాడిలో రక్షణ శాఖ కార్యాలయానికి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడితో సిరియా సైనిక స్థావరాల్లో అలజడి మొదలైంది.ఇజ్రాయెల్ దాడుల తీవ్రత ఎంతవుందో నేరుగా టీవీలో ప్రత్యక్షంగా తెలిసిపోయింది. ఒక న్యూస్ యాంకర్ లైవ్లో వార్తలు చదువుతుండగానే బాంబు శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా పేలుళ్లు రావడంతో యాంకర్ షాక్కు లోనై పరుగెత్తింది. ఈ న్యూస్ స్టూడియో సమీపంలోనే రక్షణ శాఖ కార్యాలయం ఉంది. దీంతో దాడి తీవ్రత అక్కడితోనే ఆగిపోలేదన్న అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి.
స్వెయిదా ప్రాంతంలో తెగల మధ్య రక్తపాతం
ఇక సిరియాలో మరోవైపు అంతర్గత ఘర్షణలు భయానక మలుపు తీసుకున్నాయి. స్వెయిదా ప్రాంతంలో జరిగిన తెగల మధ్య హింసాత్మక ఘర్షణలో 100 మందికిపైగా మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మైనారిటీ ద్రూజ్ మిలీషియా సభ్యులు, సున్నీ బెడ్విన్ తెగల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతంగా మారింది.ఒక కూరగాయల వ్యాపారి దోచుకునే ప్రయత్నం చేసిన ఘటనే ఈ ఘర్షణకు నాంది అయిందని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. ద్రూజ్ మిలీషియాకు చెందిన ఆ వ్యాపారిని కొన్ని సాయుధ వర్గాలు లూటీ చేయడంతో రెండు తెగల మధ్య పోరు మొదలైంది. ఇది స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ప్రపంచవ్యాప్తంగా ద్రూజ్ తెగ పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ద్రూజ్ తెగకు చెందినవారు ఉన్నారు. అందులో సగం మంది సిరియాలో నివసిస్తున్నారు. మిగతా వారు లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల్లో జీవిస్తున్నారు. ఇప్పుడు స్వదేశంలోనే వారిపై వేటు పడుతోంది. దీంతో ఆ తెగకు చెందినవారు భద్రతపై అనేక సందేహాల్లో ఉన్నారు.ఇజ్రాయెల్ దాడులు, అంతర్గత తెగల ఘర్షణలు.. రెండూ సిరియా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఒకవైపు విదేశీ దాడులు, మరోవైపు లోపలి అసంతృప్తులు ఈ దేశాన్ని అస్థిరత వైపు తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం డమాస్కస్ నుండి స్వెయిదా వరకు భయంతో ప్రజలు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







