సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- July 16, 2025
సిరియా రాజధాని డమాస్కస్ ఒకసారి మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లింది.ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోని సైనిక ప్రధాన కార్యాలయంపై విమానదాడి చేసింది.ఈ దాడిని ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది.ఇదే విషయాన్ని సిరియా సైనిక వర్గాలు కూడా నిర్ధారించాయి. ఈ దాడిలో రక్షణ శాఖ కార్యాలయానికి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడితో సిరియా సైనిక స్థావరాల్లో అలజడి మొదలైంది.ఇజ్రాయెల్ దాడుల తీవ్రత ఎంతవుందో నేరుగా టీవీలో ప్రత్యక్షంగా తెలిసిపోయింది. ఒక న్యూస్ యాంకర్ లైవ్లో వార్తలు చదువుతుండగానే బాంబు శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా పేలుళ్లు రావడంతో యాంకర్ షాక్కు లోనై పరుగెత్తింది. ఈ న్యూస్ స్టూడియో సమీపంలోనే రక్షణ శాఖ కార్యాలయం ఉంది. దీంతో దాడి తీవ్రత అక్కడితోనే ఆగిపోలేదన్న అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి.
స్వెయిదా ప్రాంతంలో తెగల మధ్య రక్తపాతం
ఇక సిరియాలో మరోవైపు అంతర్గత ఘర్షణలు భయానక మలుపు తీసుకున్నాయి. స్వెయిదా ప్రాంతంలో జరిగిన తెగల మధ్య హింసాత్మక ఘర్షణలో 100 మందికిపైగా మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మైనారిటీ ద్రూజ్ మిలీషియా సభ్యులు, సున్నీ బెడ్విన్ తెగల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతంగా మారింది.ఒక కూరగాయల వ్యాపారి దోచుకునే ప్రయత్నం చేసిన ఘటనే ఈ ఘర్షణకు నాంది అయిందని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. ద్రూజ్ మిలీషియాకు చెందిన ఆ వ్యాపారిని కొన్ని సాయుధ వర్గాలు లూటీ చేయడంతో రెండు తెగల మధ్య పోరు మొదలైంది. ఇది స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ప్రపంచవ్యాప్తంగా ద్రూజ్ తెగ పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ద్రూజ్ తెగకు చెందినవారు ఉన్నారు. అందులో సగం మంది సిరియాలో నివసిస్తున్నారు. మిగతా వారు లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల్లో జీవిస్తున్నారు. ఇప్పుడు స్వదేశంలోనే వారిపై వేటు పడుతోంది. దీంతో ఆ తెగకు చెందినవారు భద్రతపై అనేక సందేహాల్లో ఉన్నారు.ఇజ్రాయెల్ దాడులు, అంతర్గత తెగల ఘర్షణలు.. రెండూ సిరియా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఒకవైపు విదేశీ దాడులు, మరోవైపు లోపలి అసంతృప్తులు ఈ దేశాన్ని అస్థిరత వైపు తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం డమాస్కస్ నుండి స్వెయిదా వరకు భయంతో ప్రజలు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









