సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- July 16, 2025
సిరియా రాజధాని డమాస్కస్ ఒకసారి మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లింది.ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోని సైనిక ప్రధాన కార్యాలయంపై విమానదాడి చేసింది.ఈ దాడిని ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది.ఇదే విషయాన్ని సిరియా సైనిక వర్గాలు కూడా నిర్ధారించాయి. ఈ దాడిలో రక్షణ శాఖ కార్యాలయానికి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడితో సిరియా సైనిక స్థావరాల్లో అలజడి మొదలైంది.ఇజ్రాయెల్ దాడుల తీవ్రత ఎంతవుందో నేరుగా టీవీలో ప్రత్యక్షంగా తెలిసిపోయింది. ఒక న్యూస్ యాంకర్ లైవ్లో వార్తలు చదువుతుండగానే బాంబు శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా పేలుళ్లు రావడంతో యాంకర్ షాక్కు లోనై పరుగెత్తింది. ఈ న్యూస్ స్టూడియో సమీపంలోనే రక్షణ శాఖ కార్యాలయం ఉంది. దీంతో దాడి తీవ్రత అక్కడితోనే ఆగిపోలేదన్న అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి.
స్వెయిదా ప్రాంతంలో తెగల మధ్య రక్తపాతం
ఇక సిరియాలో మరోవైపు అంతర్గత ఘర్షణలు భయానక మలుపు తీసుకున్నాయి. స్వెయిదా ప్రాంతంలో జరిగిన తెగల మధ్య హింసాత్మక ఘర్షణలో 100 మందికిపైగా మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మైనారిటీ ద్రూజ్ మిలీషియా సభ్యులు, సున్నీ బెడ్విన్ తెగల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతంగా మారింది.ఒక కూరగాయల వ్యాపారి దోచుకునే ప్రయత్నం చేసిన ఘటనే ఈ ఘర్షణకు నాంది అయిందని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. ద్రూజ్ మిలీషియాకు చెందిన ఆ వ్యాపారిని కొన్ని సాయుధ వర్గాలు లూటీ చేయడంతో రెండు తెగల మధ్య పోరు మొదలైంది. ఇది స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ప్రపంచవ్యాప్తంగా ద్రూజ్ తెగ పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ద్రూజ్ తెగకు చెందినవారు ఉన్నారు. అందులో సగం మంది సిరియాలో నివసిస్తున్నారు. మిగతా వారు లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల్లో జీవిస్తున్నారు. ఇప్పుడు స్వదేశంలోనే వారిపై వేటు పడుతోంది. దీంతో ఆ తెగకు చెందినవారు భద్రతపై అనేక సందేహాల్లో ఉన్నారు.ఇజ్రాయెల్ దాడులు, అంతర్గత తెగల ఘర్షణలు.. రెండూ సిరియా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఒకవైపు విదేశీ దాడులు, మరోవైపు లోపలి అసంతృప్తులు ఈ దేశాన్ని అస్థిరత వైపు తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం డమాస్కస్ నుండి స్వెయిదా వరకు భయంతో ప్రజలు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!







