భారత్ లో RAKEZ ప్రతినిధి బృందం..వ్యాపార వృద్ధికి చర్చలు..!!
- July 17, 2025
రస్ అల్ ఖైమా: రస అల్ ఖైమా ఎకనామిక్ జోన్ (RAKEZ) ప్రత్యేక టీం హైదరాబాద్, ముంబై, పూణేతో సహా భారతదేశంలోని కీలకమైన నగరాల్లో వారం రోజుల పాటు జరిగిన పర్యటన ముగిసింది. RAKEZ గ్రూప్ CEO రామ్ జిల్లాద్ నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం.. భారతీయ పెట్టుబడిదారులు, సంస్థలతో వ్యాపార సంబంధాలను మరింతగా పెంచుకోవడం, వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా పలు ఒప్పందాలు చేసుకుంది. వేలాది భారతీయ కంపెనీలకు యూఏఈ గో-టు హబ్ గా ఉందన్నారు.రస్ అల్ ఖైమాలోని తమ ఎకనామిక్ జోన్ భారతీయ పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుందని అన్నారు.
అంతర్జాతీయ వ్యాపార సలహా సంస్థ TConsult నిర్వహించిన ఎక్స్పండ్ మిడిల్ ఈస్ట్ కార్యక్రమంలో ఈ ప్రతినిధి బృందం హైదరాబాద్లో పర్యటించింది. ఈ సందర్భంగా వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (WTITC) తో RAKEZ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MoU) పై సంతకం చేసింది. జల్లాద్, WTITC చైర్మన్ సందీప్ మక్తాల సంతకం చేసిన ఈ అవగాహన ఒప్పందం.. రస్ అల్ ఖైమా ద్వారా ప్రపంచ అవకాశాలను పొందేందుకు తెలుగు వ్యాపార సమాజానికి సాధికారత కల్పించడానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు.
తన పర్యటనలో భాగంగా RAKEZ బృందం ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన T-హబ్, భారతదేశంలోని అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రాలలో ఒకటైన T-వర్క్స్ ను కూడా సందర్శించింది.
ముంబైలో RAKEZ ముంబై స్టార్ట్ అప్ సన్ నర్లో యూఏఈ- ఇండియా స్టార్ట్-అప్ సిరీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఇది యూఏఈ- ఇండియా CEPA కౌన్సిల్ భారతీయ స్టార్టప్లను గుర్తించి మద్దతు ఇవ్వడానికి చేపట్టిన ఒక చొరవ. మరింత ఆర్ధిక సహకారాన్ని అన్వేషించడానికి భారతదేశంలోని యూఏఈ రాయబారి డాక్టర్ అబ్దుల్నాసర్ అలారీ, CEPA కౌన్సిల్ డైరెక్టర్ అహ్మద్ అలీబి, బాంబే ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు హితేష్ షాతో కూడా ఈ బృందం చర్చలు జరిపింది.
RAKEZ ఇప్పటికే 9,500 మందికి పైగా భారతీయ పెట్టుబడిదారులకు నిలయంగా ఉంది.దీని వలన భారతదేశం 35,000 కంటే ఎక్కువ కంపెనీల కమ్యూనిటీకి అగ్రగామిగా నిలిచింది. మహీంద్రా, MSSL, డాబర్ నేచురల్, అశోక్ లేలాండ్, Xpro డైఎలెక్ట్రిక్ ఫిల్మ్స్ (బిర్లా గ్రూప్ భాగం) వంటి ప్రధాన భారతీయ సంస్థలు RAKEZ నుండి పనిచేస్తూ విజయం సాధించాయి. ఇది తయారీ నుండి FMCG, ఆటోమోటివ్ వరకు విస్తృత శ్రేణి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MIDC), ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC), ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ (AIAI), యూఏఈ-ఇండియా CEPA కౌన్సిల్, ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ITEO), ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA) వంటి ప్రధాన భారతీయ పరిశ్రమ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







