గల్ఫ్ రైల్వే ప్రాజెక్టు పై GCC సెక్రటరీ జనరల్ సమీక్ష..!!
- July 17, 2025
రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సెక్రటరీ జనరల్ జాసెం అల్బుదైవి జిసిసి రైల్వే ప్రాజెక్టపై సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్ ప్రణాళిక ప్రకారం రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు.సభ్య దేశాలలో అభివృద్ధినీ పెంపొందించడంలో రైల్వే పాత్రను వివరించారు. రియాద్లోని జిసిసి జనరల్ సెక్రటేరియట్లో జరిగిన ఈ సమావేశంలో సెక్రటేరియట్, గల్ఫ్ రైల్వే అథారిటీ నుండి సీనియర్ అధికారులు ట్రాన్స్నేషనల్ రైల్వే చొరవపై తాజా అప్డేట్ లపై సమీక్షించారు. ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితి, అమలులో సాధించిన కీలక మైలురాళ్ళు, సభ్య దేశాల మధ్య కొనసాగుతున్న సమన్వయాన్ని వివరించే దృశ్య ప్రదర్శన ద్వారా అథారిటీ డైరెక్టర్ జనరల్ అల్బుదైవి వివరించారు. సభ్య దేశాలు, గల్ఫ్ రైల్వే అథారిటీలోని ప్రత్యేక బృందాలు చేసిన అధునాతన పురోగతి, ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ సమైక్యతకు కీలకమని పేర్కొన్నారు.
రైల్వే గల్ఫ్ పౌరుల ఆకాంక్షలను తీరుస్తుందని, ఈ ప్రాంతంలో ఆర్థిక, లాజిస్టికల్ కనెక్టివిటీకి కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అయ్యేలా చూసేందుకు అథారిటీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సెక్రటరీ జనరల్ కోరారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







