గల్ఫ్ రైల్వే ప్రాజెక్టు పై GCC సెక్రటరీ జనరల్ సమీక్ష..!!
- July 17, 2025
రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సెక్రటరీ జనరల్ జాసెం అల్బుదైవి జిసిసి రైల్వే ప్రాజెక్టపై సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్ ప్రణాళిక ప్రకారం రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు.సభ్య దేశాలలో అభివృద్ధినీ పెంపొందించడంలో రైల్వే పాత్రను వివరించారు. రియాద్లోని జిసిసి జనరల్ సెక్రటేరియట్లో జరిగిన ఈ సమావేశంలో సెక్రటేరియట్, గల్ఫ్ రైల్వే అథారిటీ నుండి సీనియర్ అధికారులు ట్రాన్స్నేషనల్ రైల్వే చొరవపై తాజా అప్డేట్ లపై సమీక్షించారు. ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితి, అమలులో సాధించిన కీలక మైలురాళ్ళు, సభ్య దేశాల మధ్య కొనసాగుతున్న సమన్వయాన్ని వివరించే దృశ్య ప్రదర్శన ద్వారా అథారిటీ డైరెక్టర్ జనరల్ అల్బుదైవి వివరించారు. సభ్య దేశాలు, గల్ఫ్ రైల్వే అథారిటీలోని ప్రత్యేక బృందాలు చేసిన అధునాతన పురోగతి, ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ సమైక్యతకు కీలకమని పేర్కొన్నారు.
రైల్వే గల్ఫ్ పౌరుల ఆకాంక్షలను తీరుస్తుందని, ఈ ప్రాంతంలో ఆర్థిక, లాజిస్టికల్ కనెక్టివిటీకి కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అయ్యేలా చూసేందుకు అథారిటీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సెక్రటరీ జనరల్ కోరారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









