దుబాయ్ లోని విల్లాలో చోరీ..5 మందికి జైలు శిక్ష..!!
- July 18, 2025
యూఏఈ: దుబాయ్లోని జెబెల్ అలీ ప్రాంతంలోని విల్లాలోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన గడియారాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉన్న సేఫ్ను దొంగిలించినందుకు మధ్య ఆసియా దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని దుబాయ్ క్రిమినల్ కోర్టు తన తీర్పులో ఆదేశించింది. సదరు వ్యక్తులు విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించి ఇంటి యజమానులు విదేశాలకు వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు.
సీసీ కెమెరాల ఫుటేజ్, అద్దె వాహన రికార్డుల ద్వారా అనుమానితులను గుర్తించామని ఇన్వెస్టిగేషర్ టీములోని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. నిందితులు చోరీకి ఉపయోగించిన కారును అనుమానితులలో ఒకరు లీజుకు తీసుకున్నారని, ఆ బృందం మరొక ఎమిరేట్లోని అద్దె అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకొని చోరీ సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







