దుబాయ్ లోని విల్లాలో చోరీ..5 మందికి జైలు శిక్ష..!!
- July 18, 2025
యూఏఈ: దుబాయ్లోని జెబెల్ అలీ ప్రాంతంలోని విల్లాలోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన గడియారాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉన్న సేఫ్ను దొంగిలించినందుకు మధ్య ఆసియా దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని దుబాయ్ క్రిమినల్ కోర్టు తన తీర్పులో ఆదేశించింది. సదరు వ్యక్తులు విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించి ఇంటి యజమానులు విదేశాలకు వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు.
సీసీ కెమెరాల ఫుటేజ్, అద్దె వాహన రికార్డుల ద్వారా అనుమానితులను గుర్తించామని ఇన్వెస్టిగేషర్ టీములోని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. నిందితులు చోరీకి ఉపయోగించిన కారును అనుమానితులలో ఒకరు లీజుకు తీసుకున్నారని, ఆ బృందం మరొక ఎమిరేట్లోని అద్దె అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకొని చోరీ సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









