దుబాయ్ లోని విల్లాలో చోరీ..5 మందికి జైలు శిక్ష..!!

- July 18, 2025 , by Maagulf
దుబాయ్ లోని విల్లాలో చోరీ..5 మందికి జైలు శిక్ష..!!

యూఏఈ: దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలోని విల్లాలోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన గడియారాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఉన్న సేఫ్‌ను దొంగిలించినందుకు మధ్య ఆసియా దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని దుబాయ్ క్రిమినల్ కోర్టు తన తీర్పులో ఆదేశించింది. సదరు వ్యక్తులు విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించి ఇంటి యజమానులు విదేశాలకు వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు.   

సీసీ కెమెరాల ఫుటేజ్, అద్దె వాహన రికార్డుల ద్వారా అనుమానితులను గుర్తించామని ఇన్వెస్టిగేషర్ టీములోని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. నిందితులు చోరీకి ఉపయోగించిన కారును అనుమానితులలో ఒకరు లీజుకు తీసుకున్నారని, ఆ బృందం మరొక ఎమిరేట్‌లోని అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకొని చోరీ సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com