ఆహార సహాయ కేంద్రాల సమీపంలో ఫైరింగ్..32 మంది మృతి..!!
- July 20, 2025
గాజా: దక్షిణ గాజాలోని ఆహార పంపిణీ కేంద్రాల వద్ద పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు శనివారం కాల్పులు జరిపాయి. కనీసం 32 మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు, స్థానిక అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) నిర్వహిస్తున్న సహాయ కేంద్రాల సమీపంలో కాల్పులు జరిగాయని అన్నారు. అక్కడ ఆహారం కోసం తెల్లవారుజామున నుంచే వందలాది మంది పాలస్తీనియన్లు గుమిగూడగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
గాయపడ్డవారితో నాజర్ హాస్పిటల్ నిండిపోయిందని, కీలకమైన వైద్య సామాగ్రి కూడా లేదని ఆసుపత్రి నర్సింగ్ విభాగం అధిపతి డాక్టర్ మొహమ్మద్ సాకర్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని, ఖతార్లో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు ఎటువంటి పురోగతి సాధించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







