ఆహార సహాయ కేంద్రాల సమీపంలో ఫైరింగ్..32 మంది మృతి..!!
- July 20, 2025
గాజా: దక్షిణ గాజాలోని ఆహార పంపిణీ కేంద్రాల వద్ద పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు శనివారం కాల్పులు జరిపాయి. కనీసం 32 మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు, స్థానిక అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) నిర్వహిస్తున్న సహాయ కేంద్రాల సమీపంలో కాల్పులు జరిగాయని అన్నారు. అక్కడ ఆహారం కోసం తెల్లవారుజామున నుంచే వందలాది మంది పాలస్తీనియన్లు గుమిగూడగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
గాయపడ్డవారితో నాజర్ హాస్పిటల్ నిండిపోయిందని, కీలకమైన వైద్య సామాగ్రి కూడా లేదని ఆసుపత్రి నర్సింగ్ విభాగం అధిపతి డాక్టర్ మొహమ్మద్ సాకర్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని, ఖతార్లో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు ఎటువంటి పురోగతి సాధించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







