ఆహార సహాయ కేంద్రాల సమీపంలో ఫైరింగ్..32 మంది మృతి..!!
- July 20, 2025
గాజా: దక్షిణ గాజాలోని ఆహార పంపిణీ కేంద్రాల వద్ద పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు శనివారం కాల్పులు జరిపాయి. కనీసం 32 మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు, స్థానిక అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) నిర్వహిస్తున్న సహాయ కేంద్రాల సమీపంలో కాల్పులు జరిగాయని అన్నారు. అక్కడ ఆహారం కోసం తెల్లవారుజామున నుంచే వందలాది మంది పాలస్తీనియన్లు గుమిగూడగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
గాయపడ్డవారితో నాజర్ హాస్పిటల్ నిండిపోయిందని, కీలకమైన వైద్య సామాగ్రి కూడా లేదని ఆసుపత్రి నర్సింగ్ విభాగం అధిపతి డాక్టర్ మొహమ్మద్ సాకర్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని, ఖతార్లో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు ఎటువంటి పురోగతి సాధించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









