ఆహార సహాయ కేంద్రాల సమీపంలో ఫైరింగ్..32 మంది మృతి..!!

- July 20, 2025 , by Maagulf
ఆహార సహాయ కేంద్రాల సమీపంలో ఫైరింగ్..32 మంది మృతి..!!

గాజా: దక్షిణ గాజాలోని ఆహార పంపిణీ కేంద్రాల వద్ద పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు శనివారం కాల్పులు జరిపాయి.  కనీసం 32 మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు,  స్థానిక అధికారులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) నిర్వహిస్తున్న సహాయ కేంద్రాల సమీపంలో కాల్పులు జరిగాయని అన్నారు. అక్కడ ఆహారం కోసం తెల్లవారుజామున నుంచే వందలాది మంది పాలస్తీనియన్లు గుమిగూడగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.   

గాయపడ్డవారితో నాజర్ హాస్పిటల్ నిండిపోయిందని,  కీలకమైన వైద్య సామాగ్రి కూడా లేదని ఆసుపత్రి నర్సింగ్ విభాగం అధిపతి డాక్టర్ మొహమ్మద్ సాకర్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని, ఖతార్‌లో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు ఎటువంటి పురోగతి సాధించలేదని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com