కువైట్ సర్వీసులు పెంచనున్న భారత విమానయాన సంస్థలు..!!
- July 20, 2025
కువైట్: కువైట్తో కుదిరిన విమాన సేవల ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశ దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన నెట్వర్క్లను త్వరగా విస్తరిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు 2025 నుండి కువైట్కు కొత్త మరిన్ని సర్వీసులను నడిపేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఇండిగో కువైట్ నగరానికి వారానికి 5,000 అదనపు సీట్లను, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు అకాసా ఎయిర్ సుమారు 3,000 సీట్లను, ఎయిర్ ఇండియా అదనంగా 1,500 సీట్లను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై, కొచ్చి, బెంగళూరు, తిరువనంతపురం వంటి అధిక ప్రయాణ డిమాండ్ ఉన్న నగరాల నుండి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జూలై 21 నాటికి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని విమానయాన సంస్థలను కోరింది. జూలై 16న ఇండియా-కువైట్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు వీక్లీ సీట్ల కోటాను 12,000 నుండి 18,000కి పెరిగింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









