కువైట్ సర్వీసులు పెంచనున్న భారత విమానయాన సంస్థలు..!!
- July 20, 2025
కువైట్: కువైట్తో కుదిరిన విమాన సేవల ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశ దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన నెట్వర్క్లను త్వరగా విస్తరిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు 2025 నుండి కువైట్కు కొత్త మరిన్ని సర్వీసులను నడిపేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఇండిగో కువైట్ నగరానికి వారానికి 5,000 అదనపు సీట్లను, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు అకాసా ఎయిర్ సుమారు 3,000 సీట్లను, ఎయిర్ ఇండియా అదనంగా 1,500 సీట్లను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై, కొచ్చి, బెంగళూరు, తిరువనంతపురం వంటి అధిక ప్రయాణ డిమాండ్ ఉన్న నగరాల నుండి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జూలై 21 నాటికి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని విమానయాన సంస్థలను కోరింది. జూలై 16న ఇండియా-కువైట్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు వీక్లీ సీట్ల కోటాను 12,000 నుండి 18,000కి పెరిగింది.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







