కువైట్ సర్వీసులు పెంచనున్న భారత విమానయాన సంస్థలు..!!
- July 20, 2025
కువైట్: కువైట్తో కుదిరిన విమాన సేవల ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశ దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన నెట్వర్క్లను త్వరగా విస్తరిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు 2025 నుండి కువైట్కు కొత్త మరిన్ని సర్వీసులను నడిపేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఇండిగో కువైట్ నగరానికి వారానికి 5,000 అదనపు సీట్లను, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు అకాసా ఎయిర్ సుమారు 3,000 సీట్లను, ఎయిర్ ఇండియా అదనంగా 1,500 సీట్లను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై, కొచ్చి, బెంగళూరు, తిరువనంతపురం వంటి అధిక ప్రయాణ డిమాండ్ ఉన్న నగరాల నుండి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జూలై 21 నాటికి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని విమానయాన సంస్థలను కోరింది. జూలై 16న ఇండియా-కువైట్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు వీక్లీ సీట్ల కోటాను 12,000 నుండి 18,000కి పెరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







