కువైట్ సర్వీసులు పెంచనున్న భారత విమానయాన సంస్థలు..!!
- July 20, 2025
కువైట్: కువైట్తో కుదిరిన విమాన సేవల ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశ దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన నెట్వర్క్లను త్వరగా విస్తరిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు 2025 నుండి కువైట్కు కొత్త మరిన్ని సర్వీసులను నడిపేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఇండిగో కువైట్ నగరానికి వారానికి 5,000 అదనపు సీట్లను, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు అకాసా ఎయిర్ సుమారు 3,000 సీట్లను, ఎయిర్ ఇండియా అదనంగా 1,500 సీట్లను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై, కొచ్చి, బెంగళూరు, తిరువనంతపురం వంటి అధిక ప్రయాణ డిమాండ్ ఉన్న నగరాల నుండి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జూలై 21 నాటికి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని విమానయాన సంస్థలను కోరింది. జూలై 16న ఇండియా-కువైట్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు వీక్లీ సీట్ల కోటాను 12,000 నుండి 18,000కి పెరిగింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









