ఏపీలోని తీర ప్రాంత జిల్లాలో హై అలెర్ట్

- July 22, 2025 , by Maagulf
ఏపీలోని తీర ప్రాంత జిల్లాలో హై అలెర్ట్

విశాఖపట్నం: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చైనా- హాంకాంగ్‌ లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్..బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని పేర్కొంది. తుఫాన్ కారణంగా రాబోయే 3 రోజుల పాటు ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ప్రస్తుతం తుఫానుగా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ క్రమంలో వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com