బహ్రెయిన్‌లో సోషల్ మీడియా దుర్వినియోగం..ఇద్దరికి జైలుశిక్ష..!!

- July 24, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో సోషల్ మీడియా దుర్వినియోగం..ఇద్దరికి జైలుశిక్ష..!!

మనామా: ప్రజా నైతికత, సామాజిక విలువలకు విఘాతం కలిగించిన ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 200 బహ్రెయిన్ డాలర్ల జరిమానా విధించారు. ఈ మేరకు బహ్రెయిన్‌లోని మూడవ మైనర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.   

సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన అనుచితమైన కంటెంట్‌ ప్రజా మర్యాద ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని, వర్తించే చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడించారు. అనుచితమైన కంటెంట్‌ను పంచుకోవడానికి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టానికి కట్టుబడి ఉండాలని, బహ్రెయిన్ సమాజ విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com