కంబోడియా: డిజిటల్ అరెస్ట్ల మాయ...105 మంది అరెస్టు
- July 24, 2025
ఇటీవలి కాలంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో “డిజిటల్ అరెస్ట్” పేరుతో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.కేంద్ర సంస్థల అధికారుల పేరుతో కాల్ చేసి, వీడియో కాల్ ద్వారా బెదిరింపులు చేసి, వేలాది నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేసే ముఠా గుట్టు రట్టు అయింది. ఈ ముఠా కార్యకలాపాలకు సంబంధించి కంబోడియాలో 105 మంది భారతీయులు అరెస్ట్ అయ్యారు.
డిజిటల్ అరెస్ట్ మోసాల రీత్యా ఎలా?
- భారతీయులకు విదేశీ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్.
- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ, ముంబై పోలీస్ అంటూ పరిచయం.
- అకౌంటులో అక్రమ లావాదేవీలు జరిగాయని చెబుతూ భయపెట్టి డబ్బు. పంపించాల్సిందిగా ఒత్తిడి.
- వీడియో కాల్ ద్వారా అధికారుల వేషధారణలో కనిపించి మరింత నమ్మకం కలిగించడం.
కంబోడియాలో ఆధునిక సైబర్ నెట్వర్క్ కేంద్రంగా..
- ఈ ముఠా కంబోడియాలో స్థావరాన్ని ఏర్పరచుకుని, వాయిస్ కష్టమర్ సపోర్ట్ సెంటర్ల మాదిరిగా కార్యకలాపాలు నిర్వహించేది. అక్కడి నుంచే భారత్లోని లక్షలాది మందికి టార్గెట్గా కాల్స్ చేస్తూ మోసాలు కొనసాగించారు.
- 105 మంది అరెస్టు – భారత దౌత్య ప్రమేయంతో అడ్డుబాటు.
- భారత దౌత్యపరమైన చొరవతో కంబోడియా పోలీసులు 105 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా భారతీయులే కాగా, సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసును భారత అధికారులు సమగ్రంగా విచారిస్తున్నారు.
- ప్రజలకు హెచ్చరిక
- సందేహాస్పద ఫోన్ కాల్స్ వస్తే వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు, కానూసు సంస్థల పేరుతో వచ్చే బెదిరింపులకు లోనవ్వకండి, అధికారిక వెబ్సైట్ల లేదా నంబర్ల ద్వారా నిజమైన సమాచారం ధృవీకరించుకోండి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.అయితే కంబోడియాలో అరెస్టయిన 105 మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు గత నెలలో కంబోడియా అధికారులతో సమావేశం నిర్వహించారు. కంబోడియాలో పనిచేస్తున్న సైబర్ మోసాల రాకెట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం పౌరులను హెచ్చరించింది.
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?
సైబర్ స్కామ్ల సందర్భంలో "డిజిటల్ అరెస్ట్" అనేది మోసపూరిత వ్యూహాన్ని సూచిస్తుంది, దీనిలో నేరస్థులు చట్ట అమలు సంస్థలు లేదా ప్రభుత్వ అధికారుల వలె నటించి వ్యక్తులను బెదిరించి చట్టపరమైన చర్య అనే తప్పుడు నెపంతో డబ్బు చెల్లించమని లేదా సున్నితమైన సమాచారాన్ని అందించమని బెదిరిస్తారు.
డిజిటల్ అరెస్ట్ పద్ధతి ఏమిటి?
డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరస్థులు చట్టాన్ని ఉల్లంఘించారని వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ఉపయోగించే మోసపూరిత వ్యూహం.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







