బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే
- July 24, 2025
ఓ సాలిడ్ హిట్ తో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చాలాకాలంగా ఆరాటపడుతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కెరీర్ లో ఇప్పటి వరకూ రాక్షసుడు మాత్రమే బ్లాక్ బస్టర్. మిగతావాటిలో చాలా వరకూ పోయాయి. కొన్ని కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రాబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన భైరవంలో తనే మెయిన్ లీడ్ అయినా.. ఆ మూవీ ఖలేజా రీ రిలీజ్ వెల్లువలో కొట్టుకుపోయింది. బట్ ఓటిటిలో మాత్రం రికార్డ్ స్థాయిలో దుమ్మురేపుతోంది. నెక్ట్స్ వరుసగా టైసన్ నాయుడు, హైందవం, కిష్కింద పురి చిత్రాలున్నాయి. వీటిలో అన్నికంటే ముందు కమిట్ అయిన సినిమా టైసన్ నాయుడు. కానీ అదెందుకో బాగా ఆలస్యం అవుతోంది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడా సినిమాను. ఇక ఆ మధ్య విడుదలైన హైందవం గ్లింప్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. హిందూ పురాణాల ప్రకారం దశావతారాల కాన్సెప్ట్ తో వచ్చిందా వీడియో. బాగా ఆకట్టుకుంది కూడా. ఇక మిగిలింది కిష్కింద పురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ నే అనౌన్స్ చేశారు. కిష్కింద పురి టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు వచ్చిన గ్లింప్స్ సైతం అదిరిపోయింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా అని అర్థం అయింది. ఈ చిత్రాన్నే సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. సెప్టెంబర్ లో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 5న తెలుగు నుంచి మిరాయ్ తో పాటు తమిళ్ డబ్బింగ్ మూవీస్ గా మధరాసి, భద్రకాళి చిత్రాలున్నాయి. చివరి వారంలో పవన్ కళ్యాణ్ ఓ.జి, సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటి గట్టు చిత్రాలున్నాయి. ఈ మధ్యలో కిష్కింద పురి అంటే మంచి డేట్ అనే చెప్పాలి. కాకపోతే అదే డేట్ కు అనుష్క నటించిన ఘాటీ కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ యేడాది రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు సాయిశ్రీనివాస్. పైగా రాక్షసుడు తర్వాత అనుపమతో జోడీ కట్టిన సినిమా కాబట్టి అంచనాలూ ఉంటాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









