బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే
- July 24, 2025
ఓ సాలిడ్ హిట్ తో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చాలాకాలంగా ఆరాటపడుతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కెరీర్ లో ఇప్పటి వరకూ రాక్షసుడు మాత్రమే బ్లాక్ బస్టర్. మిగతావాటిలో చాలా వరకూ పోయాయి. కొన్ని కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రాబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన భైరవంలో తనే మెయిన్ లీడ్ అయినా.. ఆ మూవీ ఖలేజా రీ రిలీజ్ వెల్లువలో కొట్టుకుపోయింది. బట్ ఓటిటిలో మాత్రం రికార్డ్ స్థాయిలో దుమ్మురేపుతోంది. నెక్ట్స్ వరుసగా టైసన్ నాయుడు, హైందవం, కిష్కింద పురి చిత్రాలున్నాయి. వీటిలో అన్నికంటే ముందు కమిట్ అయిన సినిమా టైసన్ నాయుడు. కానీ అదెందుకో బాగా ఆలస్యం అవుతోంది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడా సినిమాను. ఇక ఆ మధ్య విడుదలైన హైందవం గ్లింప్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. హిందూ పురాణాల ప్రకారం దశావతారాల కాన్సెప్ట్ తో వచ్చిందా వీడియో. బాగా ఆకట్టుకుంది కూడా. ఇక మిగిలింది కిష్కింద పురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ నే అనౌన్స్ చేశారు. కిష్కింద పురి టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు వచ్చిన గ్లింప్స్ సైతం అదిరిపోయింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా అని అర్థం అయింది. ఈ చిత్రాన్నే సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. సెప్టెంబర్ లో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 5న తెలుగు నుంచి మిరాయ్ తో పాటు తమిళ్ డబ్బింగ్ మూవీస్ గా మధరాసి, భద్రకాళి చిత్రాలున్నాయి. చివరి వారంలో పవన్ కళ్యాణ్ ఓ.జి, సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటి గట్టు చిత్రాలున్నాయి. ఈ మధ్యలో కిష్కింద పురి అంటే మంచి డేట్ అనే చెప్పాలి. కాకపోతే అదే డేట్ కు అనుష్క నటించిన ఘాటీ కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ యేడాది రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు సాయిశ్రీనివాస్. పైగా రాక్షసుడు తర్వాత అనుపమతో జోడీ కట్టిన సినిమా కాబట్టి అంచనాలూ ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









