ప్రియాంకా గాంధీతో సీఎం రేవంత్ భేటీ
- July 25, 2025
న్యూ ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు ప్రియాంకా గాంధీని కలిసారు.ఈ భేటీ ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన కులగణన సర్వే అంశంపైనే జరిగినట్లు తెలుస్తోంది.రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేలా చేపట్టిన ఈ కులగణన ప్రక్రియను ప్రియాంకా గాంధీకి వివరించినట్లు సీఎం రేవంత్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ సందర్భంగా సర్వే ద్వారా తెచ్చిన కీలక అంశాలను వివరించి, దీనివల్ల రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుందో వివరించారు.
కులగణన సర్వే అనంతరం రాష్ట్రంలో బీసీలకు (OBCs) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి కూడా ప్రియాంకా గాంధీకి వివరించారు. ఈ నిర్ణయం బీసీ వర్గాల్లో విశేషంగా హర్షాతిరేకాలు కలిగిస్తుందని భావిస్తున్నారు.విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో సామాజిక న్యాయం అందించేందుకు ఈ రిజర్వేషన్లు కీలకమవుతాయని రేవంత్ చెప్పారు. ప్రియాంకా గాంధీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటంలో మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలో చేపట్టిన కులగణన, బీసీలకు రిజర్వేషన్ల విధానం దేశమంతటా చర్చనీయాంశమవుతోంది.ఇది కేవలం ఒక రాష్ట్ర కార్యక్రమం కాదని, సామాజిక న్యాయంపై దేశానికి మార్గనిర్దేశం చేసే తెలంగాణ మోడల్ గా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి నిలబడి తెలంగాణలో అమలు చేసిన ఈ నిర్ణయానికి ప్రియాంక గాంధీ మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







