ఘనంగా వంశీ ఇంటర్నేషనల్ స్వర్ణోత్సవాలు
- July 27, 2025
హైదరాబాద్: తెలుగు సంస్కృతి పరిరక్షణకు సాంస్కృతిక సంస్థలతో కూడిన కృషి అత్యవసరం అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.ఆయన మాట్లాడుతూ, గత 54 ఏళ్లుగా వంశీ సంస్థ ద్వారా కళారంగానికి వంశీ రామరాజు అందిస్తున్న సేవలు ప్రస్తావనీయమని ప్రశంసించారు.
శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికగా వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంశీ రామరాజు–సుధా దేవి దంపతుల వైవాహిక స్వర్ణోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత్రి సుధామయి జన్మదినాన్ని గుర్తుగా ‘తెలుగు పాటకు పట్టాభిషేకం’ పేరిట సినీ సంగీత విభావరి జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ వంశీ దంపతులను సత్కరించి, వారు నిర్వహిస్తున్న విలువయిన కార్యక్రమాలు తెలుగు సమాజానికి గర్వకారణమవుతున్నాయని కొనియాడారు. వందలాది సినీ సంగీత కార్యక్రమాలకు వ్యాఖ్యానం చేసి “వ్యాఖ్యాన శిరోమణి”గా గుర్తింపు పొందిన సుధామయిని అభినందించారు.
సంఖ్యాశాస్త్ర వేత్త దైవజ్ఞ శర్మ, ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తమ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సినీ గాయకులు మిత్ర, బాల కామేశ్వరరావు, వినోద్ బాబు, గీతాంజలి, వీణా ఫణి తదితరులు మధురమైన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను మైమరిపించారు.
కార్యక్రమం నిర్వహణను సుంకరపల్లి శైలజ సమర్థవంతంగా పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!







