అల్ దహిరా గవర్నరేట్ లో 18 గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ డ్యామ్స్..!!
- July 28, 2025
ఇబ్రి: వ్యవసాయం, మత్స్య, జల వనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో అల్ దహిరా గవర్నరేట్ విలాయత్లలోని సిటిజన్ కమ్యూనిటీ భాగస్వామ్య ప్రాజెక్టులో భాగంగా 18 గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ డ్యామ్స్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాల నిల్వలను పెంచడం , భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. జల వనరుల నిర్వహణ రంగంలో సమగ్ర ప్రయత్నాల విజయాన్ని ప్రతిబింబించే క్రమంలో ఆనకట్టల నిర్మాణానికి స్థానిక పౌరులు, మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చుతున్నాయని అల్ దహిరా గవర్నరేట్లోని జల వనరుల శాఖ డైరెక్టర్ ముబారక్ సలీం అల్ జాబ్రీ తెలిపారు.
కమ్యూనిటీ భాగస్వామ్య చొరవలో భాగంగా 7 కొత్త భూగర్భ జలాల రీఛార్జ్ డ్యాములు నిర్మించే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. ఇబ్రి విలాయత్లో 3 డ్యామ్స్, యాంకుల్ విలాయత్లో 3 డ్యామ్స్, ధంక్ విలాయత్లో 1 డ్యామ్స్ ఈ ప్రాజెక్టు ఖర్చులో మంత్రిత్వ శాఖ 20 శాతం వాటాను అందిస్తుందన్నారు. మిగిలిన 80 శాతాన్ని పౌరులు భరిస్తారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అల్ దహిరా గవర్నరేట్లో ఉన్న 8 డ్యామ్స్ నిర్వహణ కూడా పూర్తయిందని అల్ జబ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







