అల్ దహిరా గవర్నరేట్ లో 18 గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ డ్యామ్స్..!!
- July 28, 2025
ఇబ్రి: వ్యవసాయం, మత్స్య, జల వనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో అల్ దహిరా గవర్నరేట్ విలాయత్లలోని సిటిజన్ కమ్యూనిటీ భాగస్వామ్య ప్రాజెక్టులో భాగంగా 18 గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ డ్యామ్స్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాల నిల్వలను పెంచడం , భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. జల వనరుల నిర్వహణ రంగంలో సమగ్ర ప్రయత్నాల విజయాన్ని ప్రతిబింబించే క్రమంలో ఆనకట్టల నిర్మాణానికి స్థానిక పౌరులు, మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చుతున్నాయని అల్ దహిరా గవర్నరేట్లోని జల వనరుల శాఖ డైరెక్టర్ ముబారక్ సలీం అల్ జాబ్రీ తెలిపారు.
కమ్యూనిటీ భాగస్వామ్య చొరవలో భాగంగా 7 కొత్త భూగర్భ జలాల రీఛార్జ్ డ్యాములు నిర్మించే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. ఇబ్రి విలాయత్లో 3 డ్యామ్స్, యాంకుల్ విలాయత్లో 3 డ్యామ్స్, ధంక్ విలాయత్లో 1 డ్యామ్స్ ఈ ప్రాజెక్టు ఖర్చులో మంత్రిత్వ శాఖ 20 శాతం వాటాను అందిస్తుందన్నారు. మిగిలిన 80 శాతాన్ని పౌరులు భరిస్తారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అల్ దహిరా గవర్నరేట్లో ఉన్న 8 డ్యామ్స్ నిర్వహణ కూడా పూర్తయిందని అల్ జబ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!