11 కేజీల 400 గ్రాముల బంగారం చోరీ...
- July 30, 2025
హిందూపురం: దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న హిందూపురం తూముకుంటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దోపిడీ ఘటనలో మొ త్తం బంగారు ఆభరణాలు 11 కేజీల 400 గ్రాములు చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారులు లెక్కలు తేల్చారు.వీటి విలువ 13కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా నగదు రూ.37.92 లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. దోపిడీ ఘటన సమాచారం వచ్చిన ప్పటి నుంచి రెండు రోజులుగా బ్యాంకు వద్ద డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగిస్తున్నారు. కుద వపెట్టిన బంగారు ఆభరణాలు ఒక్కోటి ఒక్కో క్యారెట్ టచ్లు ఉంటాయని కావున బంగారు ఆభరణాలు విలు వ రూ.9.57కోట్లు ఉండవచ్చని ఎఫ్ఎఆర్లో నమోదు చేశారు.
బ్యాంకు వద్ద మంగళవారం (Tuesday) డిఎస్పి విలేక రులతో మాట్లాడుతూ సేఫ్ లాకర్లో ఉంచిన భారీ నగదు బంగారు ఆభరణాలు చోరీ చేసిన దుండగులు లాకర్ దిగువ భాగంలో ఉన్న మరో పెట్టెను తేరిచేందుకు విఫలయత్నం చేశారని చెప్పారు. గ్యాస్ కట్టర్తో దానిని తెరిచేందుకు ప్రయత్నించిన అది అందకపోవడంతో ఫలితం వారికి దక్కలేదన్నారు. దీనివల్ల ఈ లాకర్లో ఉన్న మరో 10 కేజీల బంగారం చోరీకి గురికాకుండా కాపాడబడిందని చెప్పారు. ఇదిలా ఉండగా దోపిడీ కావడానికి బ్యాంక్ అధికారుల నిర్లక్షమే కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రెండు నెలల కిందట సిఐ బ్యాంకు ను పరిశీలించినప్పుడు డైనింగ్ హాల్కు అనుకుని ఉన్న కిటికీని భద్రత దృష్ట్యా మూసి వేసి గోడ కట్టాలని సూచించారు. ఆ కిటికీలోంచి దొం గలు సునాయాసంగా బ్యాంకులో చొరబడే ప్రమాదం ఉందని సిఐ హెచ్చరించారు. అయినప్పటికీ బ్యాంక్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరి గింది.అంతేకాకుండా నాలుగేళ్లుగా సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









