నైజీరియాలో గత నెలలో కిడ్నాపైన ఇద్దరు భారతీయుల విడుదల

- July 16, 2016 , by Maagulf
నైజీరియాలో గత నెలలో కిడ్నాపైన ఇద్దరు భారతీయుల విడుదల

నైజీరియాలో గత నెలలో కిడ్నాపైన ఇద్దరు భారతీయులను దుండగులు విడిచిపెట్ట్టారు. మంగపూడి శ్రీనివాస్, కౌషల్ అనిష్ శర్మలను భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30 నిమిషాలకు వదిలిపెట్టారని విదేశాంగ శాఖ తెలిపింది. జూన్ 29న బెంగు రాష్ట్రంలోని మక్రుడి దగ్గర గల బోకో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయుధులైన దుండగులు కిడ్నాప్ చేశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. వీరిలో శ్రీనివాస్‌ది విశాఖపట్టణం కాగా, కౌషల్ కర్ణాటక రాష్ర్టానికి చెందినవారు. కిడ్నాపర్ల చెర నుంచి వీరిద్దరు క్షేమంగా బయటపడటం పట్ల వారి కుటుంబసభ్యులు విదేశాంగ శాఖకు ధన్యవాదాలు తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com