దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఇవాళే..
- August 06, 2025
హైదరాబాద్: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తవగా ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ ప్రక్రియ కూడా పూర్తవడంతో ఇవాళ అంటే ఆగస్ట్ 6న అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు అధికారులు.
ఇక దోస్త్ స్పెషల్ ఫేజ్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆన్ లైన్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అలాగే ఆగస్టు 6వ తేదీ నుంచే సీటు కేటాయించిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. దీని గడువు ఆగస్టు 8తో పూర్తవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే సీటు క్యాన్సల్ అవుతుంది.
మీ అలాట్మెంట్ ఇలా తెలుసుకోండి:
- విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/welcome.do లోకి వెళ్లాలి.
- హోం పేజీలో క్యాండెట్ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
- తరువాత మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్/డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
స్పాట్ అడ్మిషన్ల వివరాలు:
ఆగస్టు 11వ తేదీ న్నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో దోస్త్ స్పాట్ అడ్మిషన్లు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ద్వారా తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి