అమిత్ షా కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
- August 06, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది.బుధవారం (ఆగస్టు 6) ఆయన ఝార్ఖండ్లోని చాయ్బాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరై, అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
2018 సభలో చేసిన వ్యాఖ్యలపై కేసు
ఈ కేసు వెనుక కథనం 2018లో జరిగింది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా పై చాయ్బాసాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ విమర్శలు చేశారని ఆరోపిస్తూ, ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పరువునష్టం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం, రాహుల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
హాజరు తేదీ మార్పు..హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ
ముందుగా జూన్ 26న హాజరు కావాల్సి ఉన్నా, ఇతర రాజకీయ కార్యక్రమాల కారణంగా రాహుల్ తరఫు న్యాయవాది తేదీ మార్పు కోసం ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.హైకోర్టు ఆగస్టు 6న హాజరుకావాలని స్పష్టం చేసింది.ఈ మేరకు రాహుల్ గాంధీ ఈరోజు చాయ్బాసా కోర్టులో హాజరయ్యారు.
శిబు సోరెన్ అంత్యక్రియల సందర్బంగా రాష్ట్రంలో ఉన్న రాహుల్
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అంత్యక్రియలలో పాల్గొనడానికి ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన రాహుల్, రాంచీ నుంచి హెలికాప్టర్ ద్వారా చాయ్బాసా చేరుకున్నారు. ఆయన రాకకు ముందు టాటా కాలేజ్ గ్రౌండ్లో హెలిప్యాడ్ ఏర్పాట్లు, కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. బెయిల్ మంజూరయ్యాక, ఈ కేసులో తదుపరి విచారణ తేదీని కోర్టు నిర్ణయించనుంది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







