అసోంలోని కోక్రాఝర్‌ జిల్లాలో ముగ్గురు బోడో తీవ్రవాదుల హతం

- July 17, 2016 , by Maagulf
అసోంలోని కోక్రాఝర్‌ జిల్లాలో ముగ్గురు బోడో తీవ్రవాదుల హతం

అసోంలోని కోక్రాఝర్‌ జిల్లాలో ముగ్గురు బోడో తీవ్రవాదులను పోలీసులు, సైన్యం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హతమార్చాయి. ఈ రోజు తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో బొడో తీవ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరిని చూసిన దుండగులు కాల్పులకు దిగడంతో ఆర్మీ, పోలీసు సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరిని రాహుల్‌ బసుమటరీ, రీతూ బసుమటరీలుగా గుర్తించారు. దుండగుల నుంచి నాలుగు తుపాకులు, గ్రనేడ్లు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com