వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్డౌన్ స్టార్ట్..
- August 11, 2025
ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భారత్, శ్రీలంక దేశాలు ఈ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో 50 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు జైషా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్తో పాటు పలువురు మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు.
8 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మెగాటోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి.అయితే.. ఇటీవల అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడ పెద్ద ఈవెంట్లకు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వేడుకలు అక్కడ నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి