పార్లమెంటు సమావేశాల్లో హైకోర్టు విభజనే ప్రధాన అజెండా.
- July 17, 2016
సోమవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తెరాస ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం దిల్లీలో జరిగింది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఉన్నత న్యాయస్థానం విభజించకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. అదేవిధంగా కేంద్రం తీసుకొస్తున్న పలు విధానాలపై అంశాల వారీగా మద్దతు తెలపాలని పేర్కొన్నారు.
సమావేశం అనంతరం ఎంపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు తెరాస సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. రేపు ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. హైకోర్టు విభజన అంశం ప్రధాన అజెండాగా పార్లమెంటులో తమ వైఖరి ఉండబోతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలకు కేంద్రం నుంచి ఆర్ధిక సహకారం అందించాలని కోరతామన్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









