తక్కువ ఆదాయ వర్గాలకు హోమ్ వెంటిలేటర్లు.. కుదిరిన ఒప్పందం..!!
- August 15, 2025
మస్కట్: తక్కువ ఆదాయం మరియు సామాజిక భద్రతా విభాగాల రోగులకు వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ .. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (OMIFCO)తో కుదిరిన ఒక ఒప్పందంపై సంతకం చేసింది. మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ సౌద్ అమెర్ అల్ నుధైరి, OMIFCO కమ్యూనికేషన్ డైరెక్టర్ ఖలీద్ మొహమ్మద్ అల్ ఫన్నా అల్ అరైమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రజలకు సేవ చేయడానికి ఒమన్ లోని ఇతర రంగాలతో కలిసి పనిచేస్తామని, తన వంతుగా సమాజంలోని అవసరమైన వర్గాలకు మద్దతు ఇవ్వడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందన్నారు. హోమ్ వెంటిలేటర్లు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయని, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఆసుపత్రి బయట దీర్ఘకాలిక యాంత్రిక వెంటిలేషన్ అవసరమయ్యే కొంతమంది రోగులకు హోమ్ వెంటిలేటర్లు ముఖ్యమైన లైఫ్ లైన్ గా ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?









