తక్కువ ఆదాయ వర్గాలకు హోమ్ వెంటిలేటర్లు.. కుదిరిన ఒప్పందం..!!
- August 15, 2025
మస్కట్: తక్కువ ఆదాయం మరియు సామాజిక భద్రతా విభాగాల రోగులకు వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ .. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (OMIFCO)తో కుదిరిన ఒక ఒప్పందంపై సంతకం చేసింది. మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ సౌద్ అమెర్ అల్ నుధైరి, OMIFCO కమ్యూనికేషన్ డైరెక్టర్ ఖలీద్ మొహమ్మద్ అల్ ఫన్నా అల్ అరైమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రజలకు సేవ చేయడానికి ఒమన్ లోని ఇతర రంగాలతో కలిసి పనిచేస్తామని, తన వంతుగా సమాజంలోని అవసరమైన వర్గాలకు మద్దతు ఇవ్వడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందన్నారు. హోమ్ వెంటిలేటర్లు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయని, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఆసుపత్రి బయట దీర్ఘకాలిక యాంత్రిక వెంటిలేషన్ అవసరమయ్యే కొంతమంది రోగులకు హోమ్ వెంటిలేటర్లు ముఖ్యమైన లైఫ్ లైన్ గా ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







