తక్కువ ఆదాయ వర్గాలకు హోమ్ వెంటిలేటర్లు.. కుదిరిన ఒప్పందం..!!
- August 15, 2025
మస్కట్: తక్కువ ఆదాయం మరియు సామాజిక భద్రతా విభాగాల రోగులకు వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ .. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (OMIFCO)తో కుదిరిన ఒక ఒప్పందంపై సంతకం చేసింది. మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ సౌద్ అమెర్ అల్ నుధైరి, OMIFCO కమ్యూనికేషన్ డైరెక్టర్ ఖలీద్ మొహమ్మద్ అల్ ఫన్నా అల్ అరైమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రజలకు సేవ చేయడానికి ఒమన్ లోని ఇతర రంగాలతో కలిసి పనిచేస్తామని, తన వంతుగా సమాజంలోని అవసరమైన వర్గాలకు మద్దతు ఇవ్వడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందన్నారు. హోమ్ వెంటిలేటర్లు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయని, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఆసుపత్రి బయట దీర్ఘకాలిక యాంత్రిక వెంటిలేషన్ అవసరమయ్యే కొంతమంది రోగులకు హోమ్ వెంటిలేటర్లు ముఖ్యమైన లైఫ్ లైన్ గా ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!