తక్కువ ఆదాయ వర్గాలకు హోమ్ వెంటిలేటర్లు.. కుదిరిన ఒప్పందం..!!
- August 15, 2025
మస్కట్: తక్కువ ఆదాయం మరియు సామాజిక భద్రతా విభాగాల రోగులకు వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ .. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (OMIFCO)తో కుదిరిన ఒక ఒప్పందంపై సంతకం చేసింది. మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ సౌద్ అమెర్ అల్ నుధైరి, OMIFCO కమ్యూనికేషన్ డైరెక్టర్ ఖలీద్ మొహమ్మద్ అల్ ఫన్నా అల్ అరైమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రజలకు సేవ చేయడానికి ఒమన్ లోని ఇతర రంగాలతో కలిసి పనిచేస్తామని, తన వంతుగా సమాజంలోని అవసరమైన వర్గాలకు మద్దతు ఇవ్వడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందన్నారు. హోమ్ వెంటిలేటర్లు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయని, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఆసుపత్రి బయట దీర్ఘకాలిక యాంత్రిక వెంటిలేషన్ అవసరమయ్యే కొంతమంది రోగులకు హోమ్ వెంటిలేటర్లు ముఖ్యమైన లైఫ్ లైన్ గా ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







