కృష్ణాష్టమి ప్రాముఖ్యత
- August 16, 2025
ఉత్తరప్రదేశ్లోని మథురలో యాదవ వంశానికి చెందిన ఉగ్రసేన మహారాజు పాలన సాగేది. అయితే ఆయన కొడుకు కంసుడు అత్యాశ, అహంకారం కలిగిన పరమ రాక్షస స్వభావం కలవాడు. తన తండ్రి ఉగ్రసేనుని జైలులో పెట్టి, సింహాసనాన్ని బలవంతంగా కైవసం చేసుకున్నాడు.
ఉగ్రసేన కూతురు దేవకీ, మరో యాదవ వంశాధిపతి వసుదేవుని వివాహం చేసుకుంది. కొత్తగా పెళ్లైన ఈ జంటను కంసుడు రథంలో తీసుకువెళ్తున్న సమయంలో ఆకాశవాణి ఒక భవిష్యవాణి ప్రకటించింది – “ఓ కంసా! నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదో బిడ్డ నీ వధకుడు అవుతాడు.”
ఈ మాటలు విన్న కంసుడు కోపంతో దేవకిని అప్పుడు అక్కడిక్కడే చంపబోతాడు. కానీ వసుదేవుడు ప్రాణాలు వేడుకుని, పుట్టే ప్రతి బిడ్డను తనవద్దకు అప్పగిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో కంసుడు వారిని చంపకపోయినా గృహనిర్బంధంలో పెట్టి కఠినంగా కాపలా వేయించాడు.
దేవకీ వసుదేవులకు పుట్టిన ప్రతీ సంతానాన్ని కంసుడు కనికరంలేకుండా హతమార్చేవాడు. తల్లిదండ్రులు ఎంత మిన్నకుండి వేడుకున్నా, ఆ రాక్షసుడి హృదయం కఠినంగానే ఉండేది.
ఇలా ఏడుగురు బిడ్డలు బలి అయిన తర్వాత, అష్టమి రోజున ఎనిమిదో సంతానం పుట్టింది. ఆ రాత్రి గర్జనలతో కూడిన వర్షం కురుస్తుండగా కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడి సంకెళ్లు తెగిపోయాయి. కాపలా సైనికులు గాఢనిద్రలోకి జారుకున్నారు. ఇది దైవలీల అని గ్రహించిన వసుదేవుడు తన పుట్టిన శిశువును ఎత్తుకుని యమునా వైపు నడిచాడు.
ఆ సమయంలో యమునా వరదలతో ఉప్పొంగుతున్నా, వసుదేవుడు నదిలో అడుగుపెట్టగానే మార్గం స్వయంగా సృష్టించబడింది. అలా ఆయన గోకులానికి చేరుకుని, యశోద గృహంలో పుట్టిన ఆడబిడ్డతో తన శిశువును మారుస్తాడు.
వసుదేవుడు ఆడబిడ్డను తిరిగి జైలుకి తీసుకువచ్చాడు. కంసుడి వద్ద ఆడబిడ్డ ఏడవడంతో అతడు కోపంతో దానిని చంపబోతాడు. కానీ ఆ చిన్నారి అతని చేతిలోంచి తప్పించుకుని ఆకాశంలో వెలిగిపోతూ – “నీ వధకుడు ఇప్పటికే ఎక్కడో ఉన్నాడు” అంటూ మాయమైంది. దీంతో కంసుడు ఆగ్రహంతో గోకులం వెతికినా కృష్ణుని కనుగొనలేకపోయాడు.
ఇలా గోకులానికి చేరిన శ్రీకృష్ణుడు రాజవంశానికి వారసుడైనా గోవుల కాపరిలా సాదాసీదాగా పెరిగాడు. కానీ ఆయనే శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం. అష్టమి రోజున జరిగిన ఈ దివ్య జననం శ్రీకృష్ణ జన్మాష్టమి గా ప్రతి ఏడాది భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







