అవయవ దానంలో కువైట్ రికార్డులు..!!
- August 16, 2025
కువైట్: అవయవ దానంలో కువైట్ కొత్త రికార్డులను నమోదు చేసింది. 2024లో రికార్డు స్థాయిలో 149 కిడ్నీ మార్పిడిలను నిర్వహించినట్లు కువైట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సొసైటీ చైర్మన్ డాక్టర్ తుర్కి అల్-ఒటైబి తెలిపారు. అవయవ దానం అనేది రోగులకు కొత్త జీవితాన్ని అందించే మానవతా చర్య అని ఆయన తెలిపారు.
ఊపిరితిత్తుల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, గుండె మరియు మూత్రపిండాల మార్పిడి సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం, కువైట్లో 15,000 మంది వ్యక్తులు అవయవ దాత కార్డులను కలిగి ఉన్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 మంది రోగులలో ఒకరు మాత్రమే అవసరమైన అవయవాన్ని అందుకుంటున్నారని, డిమాండ్ సరఫరాను మించిపోయిందన్నారు. ఎక్కువ మంది అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలని డాక్టర్ అల్-ఒటైబి కోరారు. ఇది ఇతరుల ప్రాణాలను కాపాడే గొప్ప మానవీయ బహుమతి అని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..