దళారులను నమ్మకండి..భక్తులకు TTD సూచన
- August 19, 2025
తిరుమల: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. స్వామి వారి దర్శనం కోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే వెళ్తుంటారు. టీటీడీ కూడా భక్తుల రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా దర్శనం టికెట్ల ను రిలీజ్ చేస్తుంటుంది. అయితే స్వామి వారి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.గత సంవత్సరం ఆగస్టు 16న వనం నటరాజ నరేంద్రకుమార్, కేఎస్ నటరాజశర్మ అనే ఇద్దరు వ్యక్తులు స్వామి వారి వీఐపీ దర్శనం కోసం రూ.90వేలు తీసుకున్నారని.. టికెట్ల కోసం ఎన్ని సార్లు ఫోన్ చేసినా..స్పందించడం లేదని విశ్వనాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. స్వామి వారి దర్శనం కోసం దళారులను నమ్మొద్దని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలని సూచించారు. కాగా నిందితులు గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని.. వారిపై 12 కేసులు నమోదు అయినట్లు విచారణలో తేలింది. దళారులను గుర్తిస్తే 0877-2263828లో ఫిర్యాదు చేయాలని టీటీడీ సూచించింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









