దళారులను నమ్మకండి..భక్తులకు TTD సూచన
- August 19, 2025
తిరుమల: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. స్వామి వారి దర్శనం కోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే వెళ్తుంటారు. టీటీడీ కూడా భక్తుల రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా దర్శనం టికెట్ల ను రిలీజ్ చేస్తుంటుంది. అయితే స్వామి వారి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.గత సంవత్సరం ఆగస్టు 16న వనం నటరాజ నరేంద్రకుమార్, కేఎస్ నటరాజశర్మ అనే ఇద్దరు వ్యక్తులు స్వామి వారి వీఐపీ దర్శనం కోసం రూ.90వేలు తీసుకున్నారని.. టికెట్ల కోసం ఎన్ని సార్లు ఫోన్ చేసినా..స్పందించడం లేదని విశ్వనాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. స్వామి వారి దర్శనం కోసం దళారులను నమ్మొద్దని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలని సూచించారు. కాగా నిందితులు గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని.. వారిపై 12 కేసులు నమోదు అయినట్లు విచారణలో తేలింది. దళారులను గుర్తిస్తే 0877-2263828లో ఫిర్యాదు చేయాలని టీటీడీ సూచించింది.
తాజా వార్తలు
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!









