జుల్ఫీలో ప్యాసింజర్ రైలు స్టేషన్..ఒప్పందంపై సంతకాలు..!!
- August 19, 2025
రియాద్: జుల్ఫీ గవర్నరేట్లో కొత్తగా ప్యాసింజర్ రైలు స్టేషన్ ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం రియాద్ డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్, రవాణా మరియు లాజిస్టిక్స్ మంత్రి మరియు సౌదీ రైల్వే కంపెనీ (SAR) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఇంజినీర్ సలేహ్ అల్-జాసర్ సమక్షంలో జరిగింది. రియాద్లోని అల్-కస్ర్ అల్-హకమ్లోని డిప్యూటీ ఎమిర్ కార్యాలయంలో ఒప్పందంపై సంతకాల కార్యక్రమం జరిగింది. సౌదీ రైల్వేస్ కంపెనీ మరియు రియాద్ ప్రాంతంలోని లాజిస్టిక్స్ సర్వీసెస్ కోఆపరేటివ్ సొసైటీ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
రియాద్ ప్రాంతం స్వల్ప కాలంలోనే అభివృద్ధి సాధించిందని డిప్యూటీ ఎమిర్ ప్రశంసించారు. ప్రస్తుతం, రియాద్ ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మరియు పర్యాటక రాజధానిగా మారిందన్నారు. 2027 ఆసియా కప్, ఎక్స్పో 2030 మరియు 2034 ప్రపంచ కప్ వంటి ప్రధాన కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తోందని అన్నారు.
జుల్ఫీ గవర్నరేట్లో కొత్త ప్యాసింజర్ స్టేషన్ రాకతో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. ఉత్తర రైల్వే నెట్వర్క్లో ఇది ఏడవ స్టేషన్గా గుర్తింపు పొందుతుందని చెప్పారు. ఇది రియాద్ నుండి అల్-ఖురాయత్ వైపు బయలుదేరి, అల్-మజ్మా, అల్-ఖాసిమ్, హైల్ మరియు అల్-జౌఫ్ గుండా వెళుతుంది. ఇది రైల్వే రవాణా సేవలను మెరుగుపరుస్తుందని, గవర్నరేట్లో ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







