ఒమన్లో కవి సౌద్ అల్-ఖహ్తానీ మృతికి సౌదీ అరేబియా సంతాపం..!!
- August 20, 2025
రియాద్: ప్రఖ్యాత సౌదీ కవి సౌద్ బిన్ మాది అల్-ఖహ్తానీ సోమవారం ఒమన్లోని దోఫర్ గవర్నరేట్లోని మిర్బాత్లోని జబల్ సంహాన్లోని ఎత్తైన పర్వతంపై నుండి పడి మరణించారు. అతనికి పర్వతారోహణ అనేది ఇష్టమని, ఈ క్రమంలోనే పర్వతం ఎక్కుతూ జారీ పడ్డారని అధికారులు తెలిపారు. కాగా, కవి అల్-ఖహ్తానీ మరణంపై మస్కట్లోని సౌదీ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. అతని మృతదేహాన్ని సౌదీ అరేబియాకు తరలించే ప్రక్రియలను పూర్తి చేయడానికి మానీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
సౌదీ మరియు గల్ఫ్ కవిత్వంలో అల్-ఖహ్తానీ ప్రసిద్ధి చెందారు. ఆయన మృతికి సౌదీ సాహిత్య ప్రపంచం సంతాపం తెలిపింది. సోషల్ మీడియా ద్వారా అల్-ఖహ్తానీకి పలువురు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









