ఒమన్లో కవి సౌద్ అల్-ఖహ్తానీ మృతికి సౌదీ అరేబియా సంతాపం..!!
- August 20, 2025
రియాద్: ప్రఖ్యాత సౌదీ కవి సౌద్ బిన్ మాది అల్-ఖహ్తానీ సోమవారం ఒమన్లోని దోఫర్ గవర్నరేట్లోని మిర్బాత్లోని జబల్ సంహాన్లోని ఎత్తైన పర్వతంపై నుండి పడి మరణించారు. అతనికి పర్వతారోహణ అనేది ఇష్టమని, ఈ క్రమంలోనే పర్వతం ఎక్కుతూ జారీ పడ్డారని అధికారులు తెలిపారు. కాగా, కవి అల్-ఖహ్తానీ మరణంపై మస్కట్లోని సౌదీ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. అతని మృతదేహాన్ని సౌదీ అరేబియాకు తరలించే ప్రక్రియలను పూర్తి చేయడానికి మానీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
సౌదీ మరియు గల్ఫ్ కవిత్వంలో అల్-ఖహ్తానీ ప్రసిద్ధి చెందారు. ఆయన మృతికి సౌదీ సాహిత్య ప్రపంచం సంతాపం తెలిపింది. సోషల్ మీడియా ద్వారా అల్-ఖహ్తానీకి పలువురు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







