తాను తెలంగాణను వదలలేదన్న ఏపీ ముఖ్యమంత్రి..
- July 18, 2016
తాను తెలంగాణను వదలలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ తెలంగాణ నేతల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. నాయకుల పనితీరుపై ప్రతినెల నివేదిక తెప్పించుకుంటానని, అంతమాత్రాన ఆంధ్రా నుంచి దిశానిర్దేశం చేసినట్టు భావించొద్దని ఆయన కోరారు. సొంత నిర్ణయాలతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, అంతేకాని ప్రతి దానికి ఏపీతో పోల్చుకోవద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్థేశం చేశారు. ఏపీలో సెన్సార్ విధానంతో పథకాల అమలును పరిశీలిస్తున్నామని, మీ పనితీరును అలాగే తెలుసుకుంటానని సరదాగా అన్ననని బాబు చెప్పారు. భేటీ సమయంలోనే టీటీడీపీ నేతలకు విశాఖలో ఎల్ఈడీ బల్బుల సిస్టం పనితీరుపై సెన్సార్ విధానాన్ని ల్యాప్ట్యాప్లో చూపించారు. అందులో 90 వేల బల్బుల్లో 45 వేలు వెలుగుతున్నాయని కనిపించిందని తెలిపారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







