మమ్ముట్టి ఆరోగ్యం పై కీలక అప్ డేట్...
- August 20, 2025
త్రివేండ్రం: మలయాళ సినీ ఇండస్ట్రీకి గర్వకారణమైన మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యం పై నెలలుగా నెలకొన్న అనిశ్చితికి ఇక తెరపడింది. ఇటీవల ఆయన సోదరుడు ఇబ్రహీంకుట్టి ఒక భావోద్వేగంతో కూడిన సోషల్ మీడియా పోస్టు ద్వారా, మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారని ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు, సినీ ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులే కాకుండా, సినీ ప్రేమికులంతా ఊపిరి పీల్చుకున్నారు. “కారుమబ్బులు కమ్మిన సముద్రాన్ని దాటి వచ్చిన ఓ నావలా ఇప్పుడు నేడు ఊపిరి పీల్చుకుంటున్నాను” అంటూ తన మనసులోని భావాలను వెల్లడించారు ఆయన.
ఇటీవల పలువురు ప్రముఖులు మమ్ముట్టి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో(Social Media) పోస్టులు పెట్టారు. దీంతో అభిమానుల మధ్య సందిగ్ధత, ఆందోళన మరింత పెరిగింది. కానీ ఈ అనుమానాలన్నింటికీ ముగింపు పలుకుతూ, ఇబ్రహీంకుట్టి, మమ్ముట్టి త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్లలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ప్రజల ప్రేమ, ప్రార్థనలు అతని కోలుకోవడంలో ఎంతో భాగం అయినట్టు పేర్కొన్నారు. ‘‘ప్రతి ఊర్లో, వీధిలో ప్రజలు నా వద్దకి వచ్చి, మా మమ్మూక్ ఎలా ఉన్నారు అని అడగడం చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది,’’ అని ఆయన అన్నారు.
ఈ పరిస్థితులపై స్పందించిన మరో సినీ ప్రముఖుడు వెల్లడించిన వివరాల ప్రకారం, మమ్ముట్టికి కొన్ని రోజులు ఆహారానికి రుచి తెలియకపోవడం వంటి చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, కానీ ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేశారు. మమ్ముట్టి ఆరోగ్యం మళ్లీ మెరుగవుతున్నట్టు తెలిసిన తర్వాత ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందావేశంతో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన రీ-ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తగా నిలిచింది.
ఈ కష్టకాలంలో మమ్ముట్టికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి, వారి ప్రేమాభిమానాలు, ప్రార్థనలకు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. “ఇచక్కపై చూపిన అపారమైన ప్రేమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ ఆయన సోదరుడు అభిమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు మమ్ముట్టి తిరిగి కెమెరా ముందు అడుగులు వేయడానికి సిద్ధమవుతుండటంతో, మలయాళ సినీ ప్రపంచం తిరిగి కళకళలాడే రోజులు దూరం కాదన్న నమ్మకం అభిమానుల్లో ఏర్పడింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







