ఖతార్ లో కొనసాగుతున్న రైడ్స్.. మరో ఫుడ్ కంపెనీ సీజ్..!!
- August 21, 2025
దోహా: ఖతార్ లో ఫుడ్ కంపెనీలు, రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా నిబంధనలు పాటించిన ఓ ఫుడ్ ప్యాకేజింగ్ కంపెనీని సీజ్ చేశారు. ఒక నెల పాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు ఖతార్ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చెడిపోయిన ఆహార ఉత్పత్తులను ప్యాకింగ్ చేసి, వాటిని రిటైల్ అవుట్లెట్లలో తిరిగి విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలిందని, దాంతో ఫ్రెష్ ఫిల్ ఫుడ్స్ కంపెనీని ఒక నెలరోజులపాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. వినియోగదారుల రక్షణకు సంబంధించి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ఏవైనా ఉల్లంఘనలు లేదా చట్టవిరుద్ధమైన పద్ధతులను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









