ఖతార్ లో కొనసాగుతున్న రైడ్స్.. మరో ఫుడ్ కంపెనీ సీజ్..!!
- August 21, 2025
దోహా: ఖతార్ లో ఫుడ్ కంపెనీలు, రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా నిబంధనలు పాటించిన ఓ ఫుడ్ ప్యాకేజింగ్ కంపెనీని సీజ్ చేశారు. ఒక నెల పాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు ఖతార్ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చెడిపోయిన ఆహార ఉత్పత్తులను ప్యాకింగ్ చేసి, వాటిని రిటైల్ అవుట్లెట్లలో తిరిగి విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలిందని, దాంతో ఫ్రెష్ ఫిల్ ఫుడ్స్ కంపెనీని ఒక నెలరోజులపాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. వినియోగదారుల రక్షణకు సంబంధించి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ఏవైనా ఉల్లంఘనలు లేదా చట్టవిరుద్ధమైన పద్ధతులను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్









