ఆదిత్యా 369 సీక్వెల్ కథ రెడీ.
- July 18, 2016
ఆదిత్యా 369.. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన మూల కథతో తెరకెక్కిన సినిమా. అప్పట్లో బాలయ్యకి బ్లాక్ బస్టర్ హిట్టునిచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ తీసుకురావాలని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. నిజానికి బాలయ్య వందో సినిమా 'ఆదిత్యా 369' తీసుకురానున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత బాలయ్య తనయుడు మోక్షజ్ఝ ఎంట్రీ ఈ సీక్వెల్ ద్వారానే ఉండనుందన్నారు. అయితే, తాజాగా ఆదిత్యా 369 సీక్వెల్ కథ రెడీ అయ్యిందని దర్శకుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. బాలయ్య ఓకే అంటే సీక్వెల్ పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. మరి.. బాలయ్య ఏమంటాడో.. ? సీక్వెల్ లో తనే నటిస్తాడా.. ?? లేదా తనయుడు మోక్షజ్ఝని రంగంలోకి దింపుతాడా.. ??? అన్నది చూడాలి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







