పసిడి ధర తగ్గింది..

- July 18, 2016 , by Maagulf
పసిడి ధర తగ్గింది..

గత కొన్ని రోజులుగా పైపైకి పోతున్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచమార్కెట్ల ప్రభావం, డిమాండ్‌ లేమితో సోమవారం బంగారం ధర రూ. 200 తగ్గి రెండు వారాల కనిష్ఠానికి చేరింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.30,550గా ఉంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,323.83 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.
బంగారం దారిలోనే వెండి వెండి ధర కూడా నేడు రూ. 240 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,260గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com