పసిడి ధర తగ్గింది..
- July 18, 2016
గత కొన్ని రోజులుగా పైపైకి పోతున్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచమార్కెట్ల ప్రభావం, డిమాండ్ లేమితో సోమవారం బంగారం ధర రూ. 200 తగ్గి రెండు వారాల కనిష్ఠానికి చేరింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.30,550గా ఉంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,323.83 అమెరికన్ డాలర్లుగా ఉంది.
బంగారం దారిలోనే వెండి వెండి ధర కూడా నేడు రూ. 240 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,260గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







