ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు శుభవార్త!

- July 18, 2016 , by Maagulf
ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు శుభవార్త!

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు శుభవార్త! 2జీ, 3జీ, 4జీ డేటా ప్యాక్‌లపై 67శాతం అదనపు డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.655తో రీఛార్జి చేయించుకుంటే 3జీబీ డేటా వచ్చేది. దాన్ని 5జీబీకి పెంచారు. చిన్న డేటా ప్యాక్‌లపై కూడా అదనపు డేటా సౌకర్యాన్ని ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. 25తో రీఛార్జి చేయించుకుంటే 100 ఎంబీకి బదులు 145 ఎంబీ, రూ.145 రీఛార్జితో 440 ఎంబీకి బదులు 580 ఎంబీ డేటాను ఇస్తోంది. సవరించిన టారిఫ్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
మరో ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఐడియా సైతం ఇటీవల తమ వినియోగదారులకు అదనపు డేటా సౌకర్యం కల్పించింది. 2జీ, 3జీ, 4జీ ప్యాక్‌లపై 45 శాతం అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించింది.రిలయన్స్‌ జియో నుంచి పోటీని తట్టుకోవడానికే ఇలా మొబైల్‌ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జియో సేవలు అందుబాటులోకి రానున్నాయన్న వార్తల నేపథ్యంలో మొబైల్‌ ఆపరేటర్లు ఇలా వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com