ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త!
- July 18, 2016
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త! 2జీ, 3జీ, 4జీ డేటా ప్యాక్లపై 67శాతం అదనపు డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.655తో రీఛార్జి చేయించుకుంటే 3జీబీ డేటా వచ్చేది. దాన్ని 5జీబీకి పెంచారు. చిన్న డేటా ప్యాక్లపై కూడా అదనపు డేటా సౌకర్యాన్ని ఎయిర్టెల్ అందిస్తోంది. 25తో రీఛార్జి చేయించుకుంటే 100 ఎంబీకి బదులు 145 ఎంబీ, రూ.145 రీఛార్జితో 440 ఎంబీకి బదులు 580 ఎంబీ డేటాను ఇస్తోంది. సవరించిన టారిఫ్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
మరో ప్రముఖ మొబైల్ నెట్వర్క్ ఐడియా సైతం ఇటీవల తమ వినియోగదారులకు అదనపు డేటా సౌకర్యం కల్పించింది. 2జీ, 3జీ, 4జీ ప్యాక్లపై 45 శాతం అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించింది.రిలయన్స్ జియో నుంచి పోటీని తట్టుకోవడానికే ఇలా మొబైల్ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జియో సేవలు అందుబాటులోకి రానున్నాయన్న వార్తల నేపథ్యంలో మొబైల్ ఆపరేటర్లు ఇలా వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







