సెప్టెంబర్ 1 నుండి ప్రధాన RAK మెయిన్ రోడ్ మూసివేత..!!
- August 27, 2025
యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ సేలం రోడ్ (E11) అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించినట్లు రస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీసెస్ విభాగం ప్రకటించింది. ఇది ఎమిరేట్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
అల్ హమ్రా రౌండ్అబౌట్ నుండి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) తో జంక్షన్ వరకు ఉన్న ఈ ప్రాజెక్ట్, రష్ అల్ ఖైమాలో రోడ్డు, యుటిలిటీ నెట్వర్క్లను విస్తరించే సమగ్ర ప్రణాళికలో భాగం అని తెలిపారు. నిర్మాణ పనుల కోసం రోడ్డును సెప్టెంబర్ 1 నుంచి మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
మొదటి దశలో ప్రతి దిశలో రోడ్డును రెండు లేన్ల నుండి నాలుగు లేన్లకు విస్తరిస్తారు. దాంతో పాటు పవర్, టెలికమ్యూనికేషన్స్, నీటిపారుదల మరియు వర్షపు నీటి పారుదల వంటి ముఖ్యమైన యుటిలిటీ నెట్వర్క్లను డెవలప్ చేయనున్నారు.
మొదటి దశ ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలో భాగంగా అల్ హమ్రా రౌండ్అబౌట్ వద్ద E11 ను మూసివేస్తారు. ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తారు. ఇందు కోసం 2 కి.మీ తాత్కాలిక రహదారిని నిర్మించారు.
ప్రాజెక్ట్ రెండవ దశతో రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతాయి. వీటిలో నాలుగు డాల్ఫిన్ జంక్షన్ (S4), E11–E311 జంక్షన్ (D1), రెడ్ టన్నెల్ (S3) మరియు మినా అల్ అరబ్ టన్నెల్ (F1/F2) ఉన్నాయి. రస్ అల్ ఖైమాలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్ నెట్వర్క్ను విస్తరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









