విదేశాలలో చిక్కుకున్న 30 మంది బహ్రెయిన్ సిటిజన్స్ రెస్క్యూ..!!
- September 03, 2025
మనామా: విదేశంలో ఊహించని సంఘటన తర్వాత 30 మంది బహ్రెయిన్ పౌరులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చినట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్థానికంగా ఉండే ట్రావెల్ ఏజెన్సీ ఒక హోటల్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిర్వహించడంలో వైఫల్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ సర్వీసెస్ సెక్టార్ హెడ్ రాయబారి ఇబ్రహీం మొహమ్మద్ అల్-ముసల్మాని తెలిపారు. సమాచారం అందగానే బహ్రెయిన్ రాయబార కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి, వివరాలు సేకరించిందన్నారు.
బహ్రెయిన్కు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అనంరతం ఫిర్యాదు సదరు ట్రావెల్ ఏజెన్సీని సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు లైసెన్స్ పొందిన మరియు గుర్తింపు పొందిన కంపెనీలతో మాత్రమే ప్రయాణించాలని కోరారు.
బహ్రెయిన్ పౌరుల భద్రతకు బహ్రెయి ప్రాధాన్యత ఇస్తుందని రాయబారి అల్-ముసల్మాని హైలైట్ చేశారు. మంత్రిత్వ శాఖ యొక్క 24/7 కాల్ అండ్ ఫాలో-అప్ సెంటర్ ఏవైనా అత్యవసర కేసులను నిర్వహించడానికి అందుబాటులో ఉంటుందని, 17227555 కు డయల్ చేయడం ద్వారా తమను సంప్రదించాలనికోరారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









