తగ్గిన రూపాయి.. UAE, GCC నుండి ఇండియాకు పెరిగిన రెమిటెన్స్..!!
- September 03, 2025
యూఏఈ: డాలర్తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయిది. దాంతో గల్ఫ్లోని ప్రవాసుల నుండి ఇండియాకు రెమిటెన్స్ భారీగా పెరిగాయి. భారతీయ వస్తువులపై ఇప్పటికే యూఎస్ 50 శాతం టారిఫ్ లతో రూపాయి విలువ డాలర్తో 88.30కి చేరుకుంది. ఇది ఇప్పటివరకు అత్యంత కనిష్ట స్థాయి.
మరోవైపు భారత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు అంచనా వేసిన 6.7 శాతాన్ని అధిగమించింది. అయితే, టారిఫ్ ల ప్రభావంతో రెండవ త్రైమాసిక వృద్ధి మందగించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
ఇక రూపాయి విలువ తగ్గడంతో తొమ్మిది మిలియన్లకు పైగా భారతీయులకు నిలయమైన గల్ఫ్లో ఉంటున్న ప్రవాసులు లాభాలను పొందుతున్నారు. ఇటీవలి రోజుల్లో భారతదేశానికి పంపే నగదులో 15 శాతం పెరుగుదల నమోదు అయిందని అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ అల్ నజ్జర్ అన్నారు. ముఖ్యంగా ఓనం పండుగ సీజన్ లావాదేవీలలో బలమైన పెరుగుదల కనిపించిందన్నారు. రూపాయి ఇప్పుడు దిర్హామ్కు 24.03 దగ్గర ట్రేడవుతోందని, చాలా మంది ప్రవాసులకు ప్రయోజనాలను కలిగిస్తుందన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







