రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- July 19, 2016
ఎమిరేటీ మహిళ, కారు ప్రమాదంలో మృతిచెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, ఓ ట్రక్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారుకి మంటలు అంటుకున్నాయి. దుబాయ్ వైపుగా ఉన్న యాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు స్పందించారు. రహదారిపై ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ప్రయాణించేవారు ట్రాఫిక్ రూల్స్ని పాటించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. భద్రతే ముఖ్యమని, ఈ విషయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









