ప్రమాద దృశ్యాలపై యూఏఈ మినిస్ట్రీ వార్నింగ్
- July 19, 2016
ట్రాఫిక్ యాక్సిడెంట్లకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టింగులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని యూఏఈ మినిస్ట్రీ హెచ్చరించింది. హ్యూమన్ డిగ్నిటీ, బాధిత కుటుంబీకుల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టరాదని మినిస్ట్రీ వర్గాలు హెచ్చరించాయి. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బాధ్యతారహిత్యం, సానుకూల దృక్పథం లేకపోవడం వంటి చర్యలకు పాల్పడరాదనీ, ఇది చట్ట వ్యతిరేకమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల అజ్మన్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో భయం గొలిపే ఫొటోలను పోస్ట్ చేయడం పట్ల మినిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫొటోలు, వీడియోల కారణంగా బాధిత కుటుంబాలు షాక్కి గురయ్యే అవకాశం ఉందనీ, అలాగే వారి మనో వేదనను ఇంకా పెంచుతాయి కాబట్టి, ఇటువంటి చర్యలు ఎవరూ చేపట్టరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







