ప్రమాద దృశ్యాలపై యూఏఈ మినిస్ట్రీ వార్నింగ్
- July 19, 2016
ట్రాఫిక్ యాక్సిడెంట్లకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టింగులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని యూఏఈ మినిస్ట్రీ హెచ్చరించింది. హ్యూమన్ డిగ్నిటీ, బాధిత కుటుంబీకుల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టరాదని మినిస్ట్రీ వర్గాలు హెచ్చరించాయి. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బాధ్యతారహిత్యం, సానుకూల దృక్పథం లేకపోవడం వంటి చర్యలకు పాల్పడరాదనీ, ఇది చట్ట వ్యతిరేకమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల అజ్మన్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో భయం గొలిపే ఫొటోలను పోస్ట్ చేయడం పట్ల మినిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫొటోలు, వీడియోల కారణంగా బాధిత కుటుంబాలు షాక్కి గురయ్యే అవకాశం ఉందనీ, అలాగే వారి మనో వేదనను ఇంకా పెంచుతాయి కాబట్టి, ఇటువంటి చర్యలు ఎవరూ చేపట్టరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







