వలసదారుడి మృతి: తప్పు మాది కాదు
- July 19, 2016
భారతీయ వలసదారుడు దివాకరన్ ఆచారి, ప్రాణాలు కోల్పోవడం వెనుక అతన్ని హైర్ చేసుకున్న కంపెనీ నిర్లక్ష్యం ఉందంటూ వస్తున్న ఆరోపణల్ని ఆ సంస్థ ఖండించింది. స్ట్రోక్ కారణంగా 58 ఏళ్ళ దివాకరన్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న దివాకరన్ స్వదేశానికి వెళ్ళేందుకు ప్రయత్నించగా దానికి ఆ సంస్థ అనుమతించలేదనీ, ఆ ఒత్తిడితోనే అతను స్ట్రోక్కి గురయ్యాడని ఆరోపించారు. అయితే సంస్థ అధికారులు మాత్రం, దివాకరన్ లీవ్ అప్లికేషన్లు ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదని స్పష్టం చేశారు. పనిచేస్తున్న సంస్థపై దివాకరన్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఎంబసీ వర్గాలు స్పష్టం చేశాయి. స్వదేశానికి వెళ్ళేందుకు ఆర్థిక సమస్యలు దివాకరన్ని వెంటాడాయనీ, ఆ సమస్య కారణంగానే తనంతట తానుగా స్వదేశానికి వెళ్ళలేకపోయాడని కంపెనీ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









