వలసదారుడి మృతి: తప్పు మాది కాదు
- July 19, 2016
భారతీయ వలసదారుడు దివాకరన్ ఆచారి, ప్రాణాలు కోల్పోవడం వెనుక అతన్ని హైర్ చేసుకున్న కంపెనీ నిర్లక్ష్యం ఉందంటూ వస్తున్న ఆరోపణల్ని ఆ సంస్థ ఖండించింది. స్ట్రోక్ కారణంగా 58 ఏళ్ళ దివాకరన్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న దివాకరన్ స్వదేశానికి వెళ్ళేందుకు ప్రయత్నించగా దానికి ఆ సంస్థ అనుమతించలేదనీ, ఆ ఒత్తిడితోనే అతను స్ట్రోక్కి గురయ్యాడని ఆరోపించారు. అయితే సంస్థ అధికారులు మాత్రం, దివాకరన్ లీవ్ అప్లికేషన్లు ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదని స్పష్టం చేశారు. పనిచేస్తున్న సంస్థపై దివాకరన్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఎంబసీ వర్గాలు స్పష్టం చేశాయి. స్వదేశానికి వెళ్ళేందుకు ఆర్థిక సమస్యలు దివాకరన్ని వెంటాడాయనీ, ఆ సమస్య కారణంగానే తనంతట తానుగా స్వదేశానికి వెళ్ళలేకపోయాడని కంపెనీ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







