వలసదారుడి మృతి: తప్పు మాది కాదు
- July 19, 2016
భారతీయ వలసదారుడు దివాకరన్ ఆచారి, ప్రాణాలు కోల్పోవడం వెనుక అతన్ని హైర్ చేసుకున్న కంపెనీ నిర్లక్ష్యం ఉందంటూ వస్తున్న ఆరోపణల్ని ఆ సంస్థ ఖండించింది. స్ట్రోక్ కారణంగా 58 ఏళ్ళ దివాకరన్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న దివాకరన్ స్వదేశానికి వెళ్ళేందుకు ప్రయత్నించగా దానికి ఆ సంస్థ అనుమతించలేదనీ, ఆ ఒత్తిడితోనే అతను స్ట్రోక్కి గురయ్యాడని ఆరోపించారు. అయితే సంస్థ అధికారులు మాత్రం, దివాకరన్ లీవ్ అప్లికేషన్లు ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదని స్పష్టం చేశారు. పనిచేస్తున్న సంస్థపై దివాకరన్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఎంబసీ వర్గాలు స్పష్టం చేశాయి. స్వదేశానికి వెళ్ళేందుకు ఆర్థిక సమస్యలు దివాకరన్ని వెంటాడాయనీ, ఆ సమస్య కారణంగానే తనంతట తానుగా స్వదేశానికి వెళ్ళలేకపోయాడని కంపెనీ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







