ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపండి..!!
- September 10, 2025
రియాద్ః ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపాలని ప్రపంచదేశాలకు సౌదీ అరేబియా కోరింది. ఖతార్ పై ఇజ్రాయెల్ దాడులపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ స్పందించారు. ఖతార్ ప్రధాన మంత్రి మషేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్తో ఫోన్లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెట్ దాడులను ఖండించారు. ఖతార్ కు అన్ని విధాల మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్ ది నేరపూరిత చర్య అని, అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు.
ప్రిన్స్ ఫైసల్ ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు బదర్ అబ్దేల్ అటీ మరియు జోర్డాన్ అయిమాన్ సఫాదిలతో ఫోన్లో చర్చలు జరిపారు. మిడిల్ ఈస్ట్ భద్రత, స్థిరత్వాన్ని అస్థిరపరిచే ఇజ్రాయెల్ చర్యలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









