ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపండి..!!
- September 10, 2025
రియాద్ః ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపాలని ప్రపంచదేశాలకు సౌదీ అరేబియా కోరింది. ఖతార్ పై ఇజ్రాయెల్ దాడులపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ స్పందించారు. ఖతార్ ప్రధాన మంత్రి మషేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్తో ఫోన్లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెట్ దాడులను ఖండించారు. ఖతార్ కు అన్ని విధాల మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్ ది నేరపూరిత చర్య అని, అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు.
ప్రిన్స్ ఫైసల్ ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు బదర్ అబ్దేల్ అటీ మరియు జోర్డాన్ అయిమాన్ సఫాదిలతో ఫోన్లో చర్చలు జరిపారు. మిడిల్ ఈస్ట్ భద్రత, స్థిరత్వాన్ని అస్థిరపరిచే ఇజ్రాయెల్ చర్యలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









