ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపండి..!!
- September 10, 2025
రియాద్ః ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపాలని ప్రపంచదేశాలకు సౌదీ అరేబియా కోరింది. ఖతార్ పై ఇజ్రాయెల్ దాడులపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ స్పందించారు. ఖతార్ ప్రధాన మంత్రి మషేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్తో ఫోన్లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెట్ దాడులను ఖండించారు. ఖతార్ కు అన్ని విధాల మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్ ది నేరపూరిత చర్య అని, అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు.
ప్రిన్స్ ఫైసల్ ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు బదర్ అబ్దేల్ అటీ మరియు జోర్డాన్ అయిమాన్ సఫాదిలతో ఫోన్లో చర్చలు జరిపారు. మిడిల్ ఈస్ట్ భద్రత, స్థిరత్వాన్ని అస్థిరపరిచే ఇజ్రాయెల్ చర్యలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









