ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపండి..!!
- September 10, 2025
రియాద్ః ఇజ్రాయెల్ అస్థిర చర్యలను ఆపాలని ప్రపంచదేశాలకు సౌదీ అరేబియా కోరింది. ఖతార్ పై ఇజ్రాయెల్ దాడులపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ స్పందించారు. ఖతార్ ప్రధాన మంత్రి మషేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్తో ఫోన్లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెట్ దాడులను ఖండించారు. ఖతార్ కు అన్ని విధాల మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్ ది నేరపూరిత చర్య అని, అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు.
ప్రిన్స్ ఫైసల్ ఈజిప్ట్ విదేశాంగ మంత్రులు బదర్ అబ్దేల్ అటీ మరియు జోర్డాన్ అయిమాన్ సఫాదిలతో ఫోన్లో చర్చలు జరిపారు. మిడిల్ ఈస్ట్ భద్రత, స్థిరత్వాన్ని అస్థిరపరిచే ఇజ్రాయెల్ చర్యలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!









