నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- September 10, 2025
ఇప్పటికే వలసవాదులపై ట్రంప్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలో భారతీయులకు గడ్డుకాలమే వచ్చింది. ప్రస్తుతం బ్రిటన్, కెనడా దేశాలు కూడా విదేశీయులపై కఠిన చర్యలకు దిగింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత గ్రీన్కార్డులు, వీసాల జారీలపై పలు ఆంక్షల్ని విధించారు. తాజాగా గ్రీన్కార్డ్ పొందడానికి అవకాశం ఉన్న మరో మార్గం కూడా తాజాగా నిలిచిపోయింది. ఈబీ-3, ఈడబ్ల్యూ వీసాల జారీని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ని లిపివేసింది.
ఆర్థిక సంవత్సరానికి వాటి కోటా పూర్తి
2024-2025 ఆర్థిక సంవత్సరానికి వాటి కోటా పూర్తికావడమే అందుకు కారణం. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు అమెరికా దౌత్య కార్యాలయాలు ఈ వీసాలను జారీ చేయవు. అక్టోబర్ఒకటి తర్వాతే కొత్త కోటాపై నిర్ణయం వెలువడనుంది. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ఒకటితో మొదలై సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. దీంతో మరికొంతకాలం గ్రీన్కార్డు వీసాల కోసం వేచి ఉండక తప్పదు. ఇప్పటికే వీసాల కఠిన నిబంధనలతో చాలామంది విద్యార్థులు తమ అమెరికా పయననిర్ణయాలను మార్చుకుని, ఇతర దేశాలకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో భారీగా విద్యార్థిలు సంఖ్య కూడా తగ్గింది.
గ్రీన్ కార్డ్ వీసాలు ఎందుకు నిలిచిపోయాయి?
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పులు, పెరిగిన అప్లికేషన్ల సంఖ్య, పరిమిత వీసా కోటా, మరియు ప్రాసెసింగ్ ఆలస్యం కారణంగా గ్రీన్ కార్డ్ వీసాలు నిలిచిపోయాయి.
ఈ నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతోంది?
ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు మరియు వారి కుటుంబాలు దీనివల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







