షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- September 11, 2025
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును ఢీకొట్టి ఒక మోటార్ సైక్లిస్ట్ మృతి చెందాడని దుబాయ్ పోలీసులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ట్రక్కు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మోటార్ సైకిల్ అదుపు తప్పి, నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్టు వివరించారు. అబుదాబి వైపు వెళ్తున్న అరేబియన్ రాంచెస్ బ్రిడ్జీ ముందు ఈ ప్రమాదం జరిగినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా బిన్ సువైదాన్ తెలిపారు. హార్డ్ షోల్డర్పై అనవసరంగా వాహనాలను ఆపడం అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ నేరాలలో ఒకటి అని, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని బ్రిగేడియర్ బిన్ సువైదాన్ చెప్పారు.
దుబాయ్లో ఇది తీవ్రమైన ట్రాఫిక్ నేరమన్న ఆయన, దీనికి వేల దిర్హామ్ల జరిమానాలు, బ్లాక్ పాయింట్లతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తారని హెచ్చరించారు. వాహనదారులు సురక్షితమైన దూరాన్ని మెయింటన్ చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో చట్టపరమైన వేగ పరిమితులను పాటించాలని, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







