షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- September 11, 2025
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును ఢీకొట్టి ఒక మోటార్ సైక్లిస్ట్ మృతి చెందాడని దుబాయ్ పోలీసులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ట్రక్కు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మోటార్ సైకిల్ అదుపు తప్పి, నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్టు వివరించారు. అబుదాబి వైపు వెళ్తున్న అరేబియన్ రాంచెస్ బ్రిడ్జీ ముందు ఈ ప్రమాదం జరిగినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా బిన్ సువైదాన్ తెలిపారు. హార్డ్ షోల్డర్పై అనవసరంగా వాహనాలను ఆపడం అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ నేరాలలో ఒకటి అని, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని బ్రిగేడియర్ బిన్ సువైదాన్ చెప్పారు.
దుబాయ్లో ఇది తీవ్రమైన ట్రాఫిక్ నేరమన్న ఆయన, దీనికి వేల దిర్హామ్ల జరిమానాలు, బ్లాక్ పాయింట్లతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తారని హెచ్చరించారు. వాహనదారులు సురక్షితమైన దూరాన్ని మెయింటన్ చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో చట్టపరమైన వేగ పరిమితులను పాటించాలని, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







