షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- September 11, 2025
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును ఢీకొట్టి ఒక మోటార్ సైక్లిస్ట్ మృతి చెందాడని దుబాయ్ పోలీసులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ట్రక్కు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మోటార్ సైకిల్ అదుపు తప్పి, నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టినట్టు వివరించారు. అబుదాబి వైపు వెళ్తున్న అరేబియన్ రాంచెస్ బ్రిడ్జీ ముందు ఈ ప్రమాదం జరిగినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా బిన్ సువైదాన్ తెలిపారు. హార్డ్ షోల్డర్పై అనవసరంగా వాహనాలను ఆపడం అత్యంత ప్రమాదకరమైన ట్రాఫిక్ నేరాలలో ఒకటి అని, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని బ్రిగేడియర్ బిన్ సువైదాన్ చెప్పారు.
దుబాయ్లో ఇది తీవ్రమైన ట్రాఫిక్ నేరమన్న ఆయన, దీనికి వేల దిర్హామ్ల జరిమానాలు, బ్లాక్ పాయింట్లతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తారని హెచ్చరించారు. వాహనదారులు సురక్షితమైన దూరాన్ని మెయింటన్ చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో చట్టపరమైన వేగ పరిమితులను పాటించాలని, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం