ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ లో కొత్త నిబంధనలు..!!
- September 12, 2025
మనామా: ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ కొత్త నిబంధనలను రూపొందించింది. ఇకపై ఫుడ్ ట్రక్కులను బహ్రెయిన్ లు మాత్రమే నడపాలని నిర్దేశించారు. జంక్షన్ల నుండి 50 మీటర్ల దూరంలో నిర్వహించాలని, ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు మాత్రమే వ్యాపారం చేయాలని పార్లమెంట్ ముందున్న ముసాయిదా బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లును ఎంపీలు ఖలీద్ బువానాక్, అహ్మద్ అల్ సల్లూమ్ మరియు హిషామ్ అల్ అవధి ప్రతిపాదించారు.
దరఖాస్తుదారులు బహ్రెయిన్కు చెందినవారు అయి ఉండాలని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నుండి ఆమోదాలు పొందాలని నిబంధనల్లో చేర్చారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్లో ఫుడ్ ట్రక్కులను నమోదు చేసుకోవాలని, వాహనం పార్కింగ్ కోసం మున్సిపల్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వాహనం దాని వాణిజ్య పేరు, వాణిజ్య రిజిస్ట్రేషన్ నంబర్ను అందరికి కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!