అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- September 12, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో అరేబియా చిరుతపులి రక్షణ కోసం మొదటి ప్రాంతీయ ప్రాజెక్ట్ మస్కట్లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా తాజా వైద్య పరికరాలతో కూడిన మొబైల్ వెటర్నరీ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఇది అరేబియా చిరుతపులి రక్షణలో వేగంగా స్పందించగల ఇంటిగ్రేటెడ్ యూనిట్గా పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక వెటర్నిటీ మెడికల్ టీం సహాయంతో ఈ యూనిట్ వన్యప్రాణుల రక్షణకు పాటుపడుతుంది. వాటి రక్షణకు తీసుకోవల్సిన విషయాలపై స్థానిక కేడర్లకు శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కార్యక్రమాలను అమలు చేయనుంది.
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అథారిటీ సహకారంతో పనిచేసే అరేబియా చిరుతపులి ఫండ్ మద్దతు ఇస్తుంది. ధోఫర్ గవర్నరేట్లోని కఠినమైన పర్వత భూభాగంలో వాటి సహజ ఆవాసాల మధ్య అరేబియా చిరుతపులికి అత్యవసర పశువైద్య సంరక్షణ అందించడానికి ఇది ప్రయత్నిస్తుందని, అరేబియా ద్వీపకల్పంలో అంతరించిపోతున్న ఈ జాతికి మిగిలి ఉన్న చివరి ఆవాసాలలో ఇది ఒకటి అని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్