అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- September 12, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో అరేబియా చిరుతపులి రక్షణ కోసం మొదటి ప్రాంతీయ ప్రాజెక్ట్ మస్కట్లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా తాజా వైద్య పరికరాలతో కూడిన మొబైల్ వెటర్నరీ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఇది అరేబియా చిరుతపులి రక్షణలో వేగంగా స్పందించగల ఇంటిగ్రేటెడ్ యూనిట్గా పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక వెటర్నిటీ మెడికల్ టీం సహాయంతో ఈ యూనిట్ వన్యప్రాణుల రక్షణకు పాటుపడుతుంది. వాటి రక్షణకు తీసుకోవల్సిన విషయాలపై స్థానిక కేడర్లకు శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కార్యక్రమాలను అమలు చేయనుంది.
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అథారిటీ సహకారంతో పనిచేసే అరేబియా చిరుతపులి ఫండ్ మద్దతు ఇస్తుంది. ధోఫర్ గవర్నరేట్లోని కఠినమైన పర్వత భూభాగంలో వాటి సహజ ఆవాసాల మధ్య అరేబియా చిరుతపులికి అత్యవసర పశువైద్య సంరక్షణ అందించడానికి ఇది ప్రయత్నిస్తుందని, అరేబియా ద్వీపకల్పంలో అంతరించిపోతున్న ఈ జాతికి మిగిలి ఉన్న చివరి ఆవాసాలలో ఇది ఒకటి అని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









