అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- September 12, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో అరేబియా చిరుతపులి రక్షణ కోసం మొదటి ప్రాంతీయ ప్రాజెక్ట్ మస్కట్లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా తాజా వైద్య పరికరాలతో కూడిన మొబైల్ వెటర్నరీ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఇది అరేబియా చిరుతపులి రక్షణలో వేగంగా స్పందించగల ఇంటిగ్రేటెడ్ యూనిట్గా పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక వెటర్నిటీ మెడికల్ టీం సహాయంతో ఈ యూనిట్ వన్యప్రాణుల రక్షణకు పాటుపడుతుంది. వాటి రక్షణకు తీసుకోవల్సిన విషయాలపై స్థానిక కేడర్లకు శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కార్యక్రమాలను అమలు చేయనుంది.
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అథారిటీ సహకారంతో పనిచేసే అరేబియా చిరుతపులి ఫండ్ మద్దతు ఇస్తుంది. ధోఫర్ గవర్నరేట్లోని కఠినమైన పర్వత భూభాగంలో వాటి సహజ ఆవాసాల మధ్య అరేబియా చిరుతపులికి అత్యవసర పశువైద్య సంరక్షణ అందించడానికి ఇది ప్రయత్నిస్తుందని, అరేబియా ద్వీపకల్పంలో అంతరించిపోతున్న ఈ జాతికి మిగిలి ఉన్న చివరి ఆవాసాలలో ఇది ఒకటి అని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







